భద్రాచలం, జూన్ 8: కొవిడ్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. బీసీఆర్ (బండారు చందర్రావు) చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల పక్కన గిరిజన బాలికల హాస్టల్లో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ వార్డును మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఎన్ఆర్ఐ ఫౌండేషన్, తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్, తానా, ఏన్కూరు గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం, సత్యసాయి సేవా సమితి, పట్టణ ప్రముఖల సహకారంతో ఐసొలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వం ప్రతి మండల కేంద్రంలో ఐసొలేషన్ వార్డును ఏర్పాటు చేస్తోందని, ప్రజల ఆరోగ్యం కోసం అన్ని చర్యలూ తీసుకుంటోందని అన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకట్రావు, తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్, సీపీఎం నాయకులు పోతినేని సుదర్శన్రావు, అన్నవరపు కనకయ్య, తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ బాధ్యులు వంశీకృష్ణ, ఎన్ఆర్ఐ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, సత్యసాయి సేవా సమితి బాధ్యులు కృష్ణమోహన్, బీసీఆర్ ట్రస్ట్ బాధులు ఏజే రమేశ్, ఏన్కూరు పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు నాగయ్య, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, టీఆర్ఎస్, టీడీపీ నేతలు, బీసీఆర్ ట్రస్ట్ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.