బోనకల్లు, ఆగస్టు1: మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో పెరిగిన ముళ్లకంపను సర్పంచ్ భుక్యా సైదానాయక్ ప్రొక్లెయిన్ ద్వారా ఆదివారం తొలగించారు. కార్యక్రమంలో నాయకులు కోయినేని ప్రదీప్, కొమ్మినేని సత్యనారాయణ, జానకీపురం సర్పంచ్ చిలకా వెంకటేశ్వర్లు, స్థానికులు రావుట్ల సత్యనారాయణ, సైదేశ్వరరావు, రంగా జనార్దన్, పల్లా సత్యనారాయణ, పెంటుసాహెబ్, ఉసికల సురేశ్ తదితరులు పాల్గొన్నారు. ఆళ్లపాడులో సర్పంచ్ మర్రి తిరుపతిరావు గ్రామంలో పారిశుధ్య పనులను చేపట్టారు. కార్యదర్శి జొన్నలగడ్డ పరశురాం, మల్టీపర్పస్ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
చింతకాని, ఆగస్టు 1: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో రవికుమార్ ఆదివారం పేర్కొన్నారు. నాగులవంచ, రైల్వే కాలనీ, నాగిలిగొండ, ప్రొద్దుటూరు, బొప్పారం, చింతకాని, పాతర్లపాడు తదితర గ్రామాల్లో సర్పంచ్లు ఆలస్యం నాగమణి, పరిటాల యలమంద, చాట్ల సురేశ్, తుడుం రాజేశ్, షేక్ గౌష్యాబీ, బండి సుభద్ర, కాండ్ర పిచ్చయ్య వారం రోజులుగా ఫాగింగ్ చేయిస్తున్నారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధా న్యం ఇవ్వాలని ఎంపీడీవో వారికి సూచించారు.