కారేపల్లి రూరల్, సెప్టెంబర్ 19: దళితబంధు పథకం అద్భుతమైనదని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు నిరాటంకంగా నాణ్యమైన విద్యుత్ను అందజేస్తూ సీఎం కేసీఆర్ విద్యుత్పై విజయయాత్ర కొనసాగిస్తున్నారని అన్నారు. కారేపల్లి మండలం భాగ్యనగర్తండాలో రూ.1.50 కోట్లతో నిర్మించిన 33/11కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో వెలుగులు నింపిన నేతగా సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచారని స్పష్టం చేశారు. 15 గ్రామాల్లో లో ఓల్టేజీ సమస్యను తీర్చి కరెంట్ కష్టాలను గట్టెక్కించడానికి ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు. టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ముత్యాల సత్యనారాయణ, రమేష్, రాములు, శకుంతల, జగన్, పుల్లయ్య, రమాదేవి, మల్లెల నాగేశ్వరరావు, ఈశ్వరిబాయి, సుజాత పాల్గొన్నారు.
సబ్ స్టేషన్ స్థలదాతకు సన్మానం
భాగ్యనగర్తండాలో 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటుకు స్థలాన్ని దానంగా ఇచ్చిన స్థానికురాలు లక్ష్మిని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ఆదివారం శాలువాతో సత్కరించి రూ.10 వేల నగదు అందజేశారు.