వైరా, అక్టోబర్ 19: టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని రాజకీయ శక్తిగా మారిందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఈ నెల 25న హైదరాబాద్లో పార్టీ ప్లీనరీ జరుగనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే రాములునాయక్ అధ్యక్షతన నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశాన్ని పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేవన్నారు. గడిచిన ఏడేళ్లలో యావత్ దేశం తెలంగాణ వైపు చూసేవిధంగా అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. హైదరాబాద్లో జరిగే ప్లీనరీకి, వరంగల్లో జరిగే విజయగర్జన బహిరంగసభకు శ్రేణులంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రతి గులాబీ సైనికుడు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
పేదలపాలిట వరం సీఎంఆర్ఎఫ్
ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం పేదలకు వరంలాంటిదని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలానికి చెందిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎంపీ నామా, ఎమ్మెల్యే రాములునాయక్ కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వైరా రూరల్కు చెందిన రూ.1,75,000 విలువైన 6 చెక్కులు, వైరా పట్టణానికి చెందిన రూ.2,07,0500 విలువైన 5 చెక్కులను లబ్ధిదారులకు అందించారు. మార్క్ఫైడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ జైపాల్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ వెంకటేశ్వరరావు, వైరా, ఏన్కూరుల ఏఎంసీ చైర్మన్లు రోశయ్య, లాలు, ఆత్మ కమిటీ చైర్మన్ నారాయణ, ఎంపీపీలు సోని, పావని, మధు, జడ్పీటీసీలు జగన్, కళావతి, బుజ్జి, కనకదుర్గా, కవిత, పీఏసీఎస్ చైర్మన్లు దుగ్గినేని శ్రీనివాసరావు, రవి, టీఆర్ఎస్ నాయకులు మద్దినేని బేబీ స్వర్ణకుమారి, వెంకటేశ్వర్లు, నరసింహారావు, సురేశ్, చిరంజీవి, రాజశేఖర్, వెంకటేశ్వరరావు, శ్రీను, వీరభద్రం, ధర్మారావు, మాధవరావు, నాగేశ్వరరావు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.