ఖమ్మం సెప్టెంబర్ 23 : రానున్న ఎన్నికలే లక్ష్యంగా యువత పని చేయాలని, పార్టీ బలోపేతానికి సైనికుల్లా పనిచేయాలని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్రెడ్డి అన్నారు. ఖమ్మంలోని తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణ చైతన్య అధ్యక్షతన గురువారం యువజన విభాగం సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న విద్యార్థి, యువజన నాయకులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీలుగా, శాసనసభ్యులుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారికి భవిష్యత్లో సముచిత స్థానం ఉంటుందన్నారు. యువత ఎన్నికలే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించుకొని పని చేయాలని పిలుపునిచ్చారు. బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు. సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, మేయర్ నీరజ, టీఆర్ఎస్ కార్యాలయ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ, నగర అధ్యక్షుడు కమర్తపు మురళి, టూ టౌన్ ఇన్చార్జ్జి చిరుమామిళ్ల కిరణ్కుమార్, టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ జిల్లాలో మంత్రి అజయ్కుమార్ ఆదేశాల మేరకు గ్రామ, మండల, బూత్ కమిటీల నిర్మాణం జరిగిందన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు దేవభక్తిని కిశోర్బాబు, మాటేటి కిరణ్కుమార్, తౌసిఫ్, మురళి, గోపి సురేశ్ తదితరులు పాల్గొన్నారు.