అడ్రస్ లేనివాళ్లను చూసి ఆగమాగం కావొద్దు
ప్రతిపక్షాలకు ఓటు నిష్ప్రయోజనం
మంత్రి పువ్వాడ అజయ్కుమార్
పలు డివిజన్లలో రోడ్షో
కాంగ్రెస్ నుంచి 100 కుటుంబాలు టీఆర్ఎస్లో చేరిక
ఖమ్మం/ ఖమ్మం వ్యవసాయం/ మామిళ్లగూడెం/ ఖమ్మం ఎడ్యుకేషన్, ఏప్రిల్ 26: అభివృద్ధి, సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ మంత్రమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. కేఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన 49వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి ఊటుకూరి రవికాంత్ గెలుపును కాంక్షిస్తూ జూబ్లీహిల్స్, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, భాస్కరరావుతో కలిసి ఆ డివిజన్లో ర్యాలీ నిర్వహించారు. తొలుత డివిజన్లోని టీడీపీ, కాంగ్రెస్, సీపీఎలకు చెందిన ముఖ్య నాయకులు, మాజీ కౌన్సిలర్ మన్నే శేషరత్నం, మన్నే రమణ, 49వ డివిజన్ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి జమలాపురం కేశవరావు, ఊటుకూరి రవికిరణ్తో పలువురు నాయకులు, కాంగ్రెస్ నుంచి 100 కుటుంబాల వారు మంత్రి పువ్వాడ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కేఎంసీ ఎన్నికల్లో ఊటుకూరి రవికాంత్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికలు అనగానే అడ్రస్ లేని వారు ఎందరో కనపడతారని, అలాంటి వారి మాటలు నమ్మి ఆగమాగం కావద్దని సూచించారు.
18, 22, 23, 24 డివిజన్లలో..
కేఎంసీలోని 18, 22, 23, 24 డివిజన్లలో కూడా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రచారం నిర్వహించారు. 18వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి మందడపు లక్ష్మి మనోహర్రావు, టీఆర్ఎస్ బలపర్చిన సీపీఐ అభ్యర్థి చామకూరి వెంకటనారాయణ, 24వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి కమర్తపు మురళి, 23వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి ఎస్కే మగ్బూల్, 22వ డివిజన్ అభ్యర్థి పల్లా రోజ్లీనాలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ముస్తాఫానగర్ సంభానీనగర్ బోర్డు వద్ద కూడలిలో మంత్రి అజయ్కుమార్ మాట్లాడుతూ టీఆర్ఎస్, సీపీఐ అభ్యర్థులను గెలిపించి తనకు ఇస్తే నగర అభివృద్ధి బాధ్యతను నేను తీసుకుంటానని అన్నారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, మాజీ కార్పొరేటర్ మందడపు మనోహర్రావు పాల్గొన్నారు.
ఖమ్మం రూపురేఖలు మార్చా..
ఖమ్మం నగర రూపరేఖలు మార్చగలిగాలని, రానున్న రోజుల్లో తెలంగాణలో ఖమ్మాన్ని అగ్రభాగాన నిలుపుతానని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. అందుకోసం కేఎంసీలోని 60 సీట్లూ గెలిపించాలని కోరారు. నగరంలోని 31, 32, 33 డివిజన్లోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. ఈ డివిజన్లలో టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న దండగల రాంబాబు, ధోన్వాన్ సరస్వతి, తోట ఉమారాణిలను అత్యధిక మెజార్టీలతో గెలిపించాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ, తోట వీరభద్రం, రవి నాయక్, రమేశ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.