కూసుమంచి : ఖమ్మం జిల్లాలోనే అతి పెద్దచెరువు పాలేరులో ఈ ఏడాది చేపలు, రోయ్యల వేటకు రంగం సిద్ధమైంది. ఆదివారం నుంచి మత్స్యకారులు రిజర్వాయర్లోకి దిగనున్నారు. అధికారికంగా 1,350 మంది మత్స్యకారులు, అనధికారికంగా మరో 200 మంది దాదాపు 1,550 మంది వరకు మత్స్యకారులు పాలేరులో చేపల వేట ప్రారంభించనున్నారు. చేపలు మత్స్యకారులు ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు పట్టుకోవచ్చు. అయితే రోయ్యలను నాయకన్గూడెంలోని రోయ్యల కొనుగోలు కేంద్రానికే ఇవ్వాలని మత్స్యసహకార సంఘం సభ్యులు తీర్మానించారు. ఆదివారం నుంచి పాలేరు తీరం మత్స్యకారులు, వారి కుటుంబ సభ్యులతో సందడిగా మారనున్నది.