ఖమ్మం, జూలై 29: బీజేపీ నేత ఈటల రాజేందర్, బావమరిది మధుసూదన్రెడ్డి దళితులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై గురువారం టీఆర్ఎస్ ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు ప్రసాద్ ఆధ్వర్యంలో నాయకుడు కంచర్ల దయాకర్, అంబేడ్కర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు లింగాల రవికుమార్ నగరంలోని అంబేడ్కర్ సెంటర్లో నిరసన చేపట్టారు. ముందుగా బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఆయన బంధువు మధుసూదన్రెడిల దిష్టిబొమ్మను దహనం చేశారు. దళిత బంధు పథకంతో సీఎం కేసీఆర్ ఎస్సీల అభ్యున్నతికి కృషి చేస్తుంటే బీజేపీ నాయకులు నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు నామవరపు ఈశ్వర్, ఆరెంపుల వీరభద్రం, బుర్రి వెంకట్, దాదే సతీశ్, పాకాలపాటి శేషగిరి, ఫ్రాన్సిస్, నాగరాజు, నామవరపు సతీశ్, పిడతల రామ్మూర్తి, నాగేశ్వరరావు, కల్యాణ్రాం, ఉపేందర్, చింతుర్ల సంపత్, కొత్తపల్లి మనోహర్, భారత్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
బొమ్మెర రామ్మూర్తి ఆధ్వర్యంలో..
నగరంలోని అంబేడ్కర్ సెంటర్లో టీఆర్ఎస్ మధిర నియోజకవర్గ మాజీ ఇన్చార్జి బొమ్మెర రామ్మూర్తి, నాయకులు మాజీ మంత్రి ఈటల రాజేందర్ బావమరిది మధుసూదన్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాదిగ డెవలప్మెంట్ ఫోరం (ఎండీఎఫ్) సభ్యులు గొల్లమందల మోహన్ చైతన్య, చేకూరి సతీశ్, మహాజన్, అర్జున్, వీరాంజనేయులు, రాంబాబు, రామారావు, ప్రేమ్కుమార్ పాల్గొన్నారు.