Manakondoru
శంకరపట్నం : శంకరపట్నం మండలంలోని ఆముదాలపల్లి గ్రామ అభివృద్ధికి సహకరిస్తానని ఆర్థికమంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. మంత్రి మంగళవారం వీణవంకలో ఉప ఎన్నిక ప్రచారం ముగించుకుని ఆముదాలపల్లి మీదుగా సింగాపురానికి వెళ్తుండగా, ఆముదాలపల్లిలో కొద్దిసేపు ఆగి గ్రామస్తులతో ముచ్చటించారు. సర్పంచ్ బత్తుల మానస, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు పెద్ది శ్రీనివాస్రెడ్డి, ఉప సర్పంచ్ కనవేని జంపయ్య తదితరులు మంత్రిని కలిశారు.