కరీంనగర్ : రెమిడెసివిర్ ఇంజక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న నలుగురు ముఠా సభ్యులను కరీంనగర్ జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నలుగురు నిందితులు జిల్లా కేంద్రానికి చెందిన వారేనని గుర్తించారు.
కొందరు రెమిడెసివిర్ ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది.
దీంతో నిఘా పెట్టి జిల్లా కేంద్రంలో ఓ బాధిత కుటుంబానికి ఒక్కో ఇంజక్షన్ను రూ. 25 వేలకు విక్రయిస్తుండగా పట్టుకున్నారు.
వీరి నుంచి 18 రెమిడెసివిర్ ఇంజక్షన్లు, రూ. 40 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
కరోనా సమయంలో మానవతావాదంతో ఆలోచించాలని, ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్ చేసి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.