గన్నేరువరం : మండల కేంద్రం గన్నేరువరంలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద ఉన్న కల్వర్టు పైపు పైన సుమారు 20-30 పాములు గుమికూడి ఉన్నాయి. వర్షానికి తాళ్లకుంట నుంచి నీరు అధికంగా ప్రవహిస్తుండటంతో ఆ వర్షం నీటిలో ఈ పాములు కొట్టుకొచ్చి ఒకచోట గుమికూడి నీటిలో వస్తున్న చేప పిల్లలను వేటాడి పట్టుకొని తింటున్నాయి. రోడ్డుపై వెళ్తున్న పలువురు బాటసారులు ఈ పాములను చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. కొంతమంది ఈ పాముల దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.