వీణవంక, ఫిబ్రవరి 2: బీఆర్ఎస్ సభకు వస్తూ ప్రమాదంలో గాయపడ్డ వారికి సొంతఖర్చులతో మెరుగైన చికిత్స చేయిస్తానని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి భరోసానిచ్చారు. మండలంలోని పోతిరెడ్డిపల్లికి చెందిన బండారి పాపయ్య, నందిపాట సద య్య జనవరి 31న జమ్మికుంటలో జరిగిన కేటీఆర్ సభకు వాహనాల్లో వెళ్తుండగా ప్రమాదానికి గురై గాయపడ్డారు. వీరిని వెంటనే బీఆర్ఎస్ నాయకులు దవాఖానకు తరలించి చికిత్స చేయించారు. కాగా, గురువారం ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పరామర్శించారు. ప్రమాదతీరును తెలుసుకొని ఆర్థిక సహాయం అందజేశారు. అండగా ఉంటా నని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న కార్యకర్తలను ఆదుకుంటానని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, ఎంపీటీసీ రాధారపు రాంచందర్, నాయకులు పంజాల సతీశ్, రమేశ్, గంగాడి తిరుపతిరెడ్డి, కుమార్, తదితరులు పాల్గొన్నారు.
వీణవంక మండల కేంద్రంలో సర్పంచ్ నీల కు మారస్వామి సొంత ఖర్చులతో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించడం అభినందనీయమని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. గురువారం టాయ్లెట్స్ను ప్రారంభించి మాట్లాడారు. ప్రజలు స్వచ్ఛతపై దృష్టి సారించాలని కోరారు. వీణవంక పారిశుధ్య నిర్వహణలో ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలువాలని చెప్పారు. మండలవాసులు, వివిధ పనుల కోసం వచ్చేవారు ఈ టాయ్లెట్స్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, సర్పంచ్ నీల కుమారస్వామి, వైస్ ఎంపీపీ రాయిశెట్టి లత-శ్రీనివాస్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ తిరుపతిరెడ్డి, ఉప సర్పంచ్ భానుచందర్, వార్డు సభ్యులు వెంకటరమణ, రాజు, భిక్షపతి, సంపత్, మహేశ్, నాయకులు కృష్ణచైతన్య, క్రాంతి, మధు, ఓరెం శ్రీనివాస్, రవి, గౌస్, నీల పున్నంచందర్, సురేశ్, నీల శ్రీకాంత్, పంచాయతీ సెక్రటరీ రవూఫ్, కారోబార్ ఆదిమూర్తి పాల్గొన్నారు.