వేములవాడ టౌన్, డిసెంబర్ 1 : గత 34 నెలలుగా భక్తుల పుణ్యస్నానాలకు దూరంగా ఉన్న రాజన్న ధర్మగుండం మళ్లీ అందుబాటులోకి రాబోతున్నది. నాలుగు రోజులుగా చేపట్టిన పూడికతీత పనులు పూర్తి కాగా, గురువారం ఫైరింజన్ సహాయంతో పుష్కరణి చుట్టూ శుభ్రం చేశారు. గోపురాలను,
ధర్మగుండం మెట్లను పూర్తిగా శుభ్రం చేసి భక్తుల పుణ్యస్నానాలకోసం సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 4 (ఆదివారం) ఉదయం వరకు మిషన్భగీరథ నీటితో అందుబాటులోకి వస్తుందని అలయ అధికారులు తెలిపారు.