కరీంనగర్ : అమ్మవారి దయతో ప్రజలంతా చల్లగా ఉండాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆకాంక్షించారు. శనివారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 12వ డివిజన్లో ఆషాఢ బోనాల ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాల్లో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొని స్థానికులతో కలిసి బోనంతో ఊరేగింపుగా శివశిత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాల నడుమ అమ్మవారి ఆలయాలకు చేరుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బొడ్డు రజిత రవీందర్, బాలరాజ్ కుమార్, సురేష్ భవాని, ఇరుగురాళ్ల శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.