జగిత్యాల : జగిత్యాల మండలం చల్గల్ మ్యాంగో మార్కెట్లో రూ. 2 కోట్ల 40 లక్షల నిధులతో నిర్మించనున్నషెడ్ల నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల మ్యాంగో మార్కెట్లో అన్ని సీజన్లకు సంబంధించిన పండ్లను ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేలా ఫ్రూట్ హబ్గా మారుస్తామన్నారు.
ఈ సంవత్సరం మ్యాంగో వ్యాపారులకు గూడ్స్ రైలు సౌకర్యం కల్పించడంతో ట్రాన్స్పోర్ట్కు అయ్యే ఖర్చుల్లో సగం డబ్బులతో ఢిల్లీకి మ్యాంగోను ఎగుమతి చేయగలిగామన్నారు. రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై మొగ్గు చూపినట్లయితే అధిక లాభాలను పొందవచ్చన్నారు. ఆయిల్ఫామ్, పల్లీ, నువ్వుల లాంటి నూనె గింజల సాగుపై రైతులు దృష్టి సారించినట్లయితే ప్రతి సంవత్సరం విదేశాల నుంచి నూనెలను దిగుమతి చేసుకొనే పరిస్థితులు తగ్గడంతో పాటు రైతులకు మేలు జరుగుతుందన్నారు.