శంకరపట్నం, సెప్టెంబర్ 21: జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. కేశవపట్నం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ శిబిరాన్ని మంగళవారం ఆయన అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పంచాయతీ అధికారులను, వైద్య సిబ్బందిని కొవిడ్ వ్యాక్సినేషన్ సరళి గురించి అడిగి తెలుసుకున్నారు.
కేశవపట్నం గ్రామ జనాభా ఎంత.., ఇప్పటి వరకు ఎంత మందికి వ్యాక్సిన్ వేశారు..?, మొదటి, రెండో డోసు వివరాలు.. రోజు వారీ టార్గెట్.. తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సినేషన్ మందకొడిగా కొనసాగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జనం గుమిగూడి ఉండే చోటనే వ్యాక్సినేషన్ శిబిరాలు ఏర్పాటు చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. అవసరమైతే ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, ఐకేపీ సిబ్బంది సహాయం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ గూడూరి శ్రీనివాస్రావు, వైద్యాధికారి సయ్యద్ షాకీర్ అహ్మద్, ఎంపీవో సురేందర్, ఉప సర్పంచ్ గజెల్లి హన్మంతు, పంచాయతీ కార్యదర్శి చిట్టి, ఏఎన్ఎం శ్రీవాణి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
మానకొండూర్ రూరల్, సెప్టెంబర్ 21: గట్టుదుద్దెనపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో మానకొండూర్ పీహెచ్సీ డాక్టర్ సంధ్యారాణి ఆధ్వర్యంలో కొవిడ్ వ్యాక్సినేషన్ నిర్వహించారు. వ్యాక్సినేషన్ను కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సందర్శించారు. వ్యాక్సిన్ వేస్తున్న తీరును పరిశీలించారు. కాగా, గట్టుదుద్దెనపల్లిలో 103 మందికి వ్యాక్సిన్ వేశారు. కార్యక్రమంలో సీహెచ్వో రాజు నాయక్, ఎంపీవో ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి తార, వైద్య సిబ్బంది తదితలు పాల్గొన్నారు.