హుజూరాబాద్, సెప్టెంబర్ 14 : ఈ నెల 24న హుజూరాబాద్లో రెడ్డి సంఘ భవన్ నిర్మాణానికి భూమిపూజ చేస్తున్నామని, అదే రోజు కేసీ క్యాంపులో పది వేల మందితో రెడ్డి ఆత్మీయ సమ్మేళన సభ నిర్వహిస్తున్నామని హుజూరాబాద్ రెడ్డి సంక్షేమ సంఘం ముఖ్య నాయకులు తెలిపారు. ప్రతి రెడ్డి కుటుంబం తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రెడ్ల ఐక్యతను చాటి ప్రభుత్వానికి రెడ్డి కార్పొరేషన్ ఆకాంక్షను బలంగా చాటుదామని చెప్పారు. హుజూరాబాద్ సిటీసెంటర్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రెడ్డి సంఘ భవన్ కోసం రాష్ట్ర సర్కారు స్థలం కేటాయించిందని, కోటి నిధులు ఇచ్చిందని తెలిపారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిషరించిందని చెప్పారు.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలిచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో వయో పరిమితిని 28 ఏండ్ల నుంచి 33 ఏండ్ల వరకు పెంచడంతో నిరుద్యోగులకు అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో కేంద్రప్రభుత్వం పెట్టిన నిబంధనలు తొలగించి 8 లక్షల ఆదాయ పరిమితికి లోబడే కుటుంబాలకు సడలించాలనడంతో పేదరెడ్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు విజయభాస్కర్రెడ్డి, కొండాల్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, నాయకులు పోరెడ్డి శంతన్రెడ్డి, చొల్లేటి కిషన్రెడ్డి, చందుపట్ల నర్సింహారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, రాజిరెడ్డి, దండ విక్రమ్రెడ్డి, జిల్లెల తిరుపతిరెడ్డి, మర్రి శ్రీనివాస్రెడ్డి, ఎక్కటి సంజీవరెడ్డి, గూడూరి స్వామిరెడ్డి, కంకనాల సరోజన, పెండ్యాల కవితారెడ్డి, పాకాల లక్ష్మారెడ్డి, ఇరుమల్ల సురేందర్రెడ్డి, ఏనుగు సత్యనారాయణరెడ్డి, కర్ర గోపాల్రెడ్డి, పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.