సింగరేణి భూ నిర్వాసిత గ్రామాల సమస్యలపై ప్రభు త్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. నిర్వాసిత కుటుంబాలకు న ష్టపరిహారం చెల్లించి, ఇబ్బందుల్లేకుండా చూసుకుంటున్నది. రాష్ట్ర సర్కారు ఆదేశాల మేరకు సిం గరేణి యా జమాన్యం ఆర్అండ్ఆర్ కా లనీల్లో పూర్తి సౌకర్యాల క ల్పనకు చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగం గా బెల్లంపల్లి ఏరియాలోని తాండూర్ మండలం అబ్బాపూర్ ఓపెన్కా స్టు నిర్వాసితులకు వెంటనే పూర్తి పరిహారం చెల్లించడంతో పా టు సకల సౌకర్యాలు కల్పించింది. దీంతో నిర్వాసిత కు టుంబాల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏరియాలోని ఖైర్గూడ, డోర్లీ-1, 2 ఓసీపీలో భూములు, ఇండ్లు కోల్పోయిన వారికి యాజమాన్యం ఆర్అండ్ఆర్ కేంద్రాలు నిర్మించి, అందులో సౌకర్యాలు కల్పిస్తున్నది. బీపీఏ ఓసీపీ-2 (అబ్బాపూర్)లో తాండూర్ మండలం అబ్బాపూర్ గ్రామస్తులు తమ ఇండ్లు, భూములు కోల్పోయారు. వారికి నర్సాపూర్ వద్ద నర్సాపూర్ ఆర్అండ్ఆర్ సెంటర్ నిర్మించింది. ఇందుకు సంబంధించి పనులు మొత్తం పూర్తిచేసింది. అబ్బాపూర్లో 66 కుటుంబాలుండగా, వారికి పునరావాసం కోసం నర్సాపూర్ సమీపంలో కొత్తగా అబ్బాపూర్ ఆర్అండ్ఆర్ సెంటర్ ఏర్పాటు చేసింది. రూ.2 కోట్లతో పనులు పూర్తిచేసింది. రూ.30 లక్షలతో సుమారు 12 ఎకరాలు కొనుగోలు చేసి, 85 ఫ్లాట్లు ఏర్పాటు చేసింది. అందులో రూ.కోటితో సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, రూ.25 లక్షలతో మంచినీటి ట్యాంకు, రూ.5 లక్షలతో బోర్వెల్ పంపులు, రూ.10 లక్షలతో విద్యుత్ స్తంభాలు, మిగిలిన ఫ్లాట్ల మధ్యలో బడి, గుడి, పార్కుకు స్థలాలు కేటాయించి నిర్మాణాలు చేపట్టింది.
నష్టపరిహారం చెల్లింపు..
ఇక్కడ నివసిస్తున్న వారికి నష్టపరిహారం చెల్లింపులు కూడా పూర్తయ్యాయి. ఆ గ్రామంలో భార్యాభర్తలకు కలిపి రూ.7.80 లక్షలు చెల్లించారు. వారికి మేజర్ పిల్లలు ఉంటే అదనంగా రూ.7.80 లక్షలు అందించారు. మొత్తం 85 కుటుంబాలకు రూ.6.63 కోట్లు చెల్లించారు. ఈ పరిహారం మొత్తం ఏప్రిల్ 30న అందరి ఖాతాల్లో జమచేసినట్లు సింగరేణి అధికారులు వెల్లడించారు. ఇంకా ఈ గ్రామంలో 54 ఎకరాలకు సంబంధించి 10 మంది గిరిజన రైతులకు పరిహారం అందించాల్సి ఉంది. ఈ భూమికి సంబంధించి అటవీ క్లియరెన్స్ సైతం వచ్చింది. వారికి కూడా త్వరలోనే పరిహారం అందనున్నది. అలాగే చనిపోయిన వారి వారసులు 8 మందికి కూడా పరిహారం బ్యాంకుల్లో జమ చేశారు. డెత్ సర్టిఫికెట్లు సమర్పిస్తే వారికి కూడా ఈ పరిహారం అందనున్నది.
గ్రామస్తుల ఆనందం..
అన్ని సౌకర్యాలతో ఆర్అండ్ఆర్ సెంటర్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని అబ్బాపూర్ గ్రామస్తులు చెబుతున్నారు. ఆర్అండ్ఆర్ కాలనీలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో తమ గూడెంలో ఎన్నో ఇబ్బందులు పడేవాళ్లమని, కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి ఉండబోదని అంటున్నారు. తమకు అన్ని సౌకర్యాలతో కాలనీ నిర్మించిన సింగరేణి యాజమాన్యానికి కృతజ్ఞతలు చెబుతున్నారు.
అందరికీ కృతజతలు
అబ్బాపూర్ గ్రామస్తులకు ఆర్అండ్ఆర్ కాలనీ ఏర్పాటు చేసి, సౌకర్యాలు కల్పించిన్రు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు సింగరేణి అధికారులు అన్ని వసతులు కల్పించిన్రు. ఆర్అండ్ఆర్ కాలనీని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నరు. భూములు, ఇండ్లు కోల్పోతున్న వారి కి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి ప్రోత్సాహం అందించాలి. సింగరేణి యాజమాన్యం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి.
– కుర్సెంగ జంగుబాయి, సర్పంచ్, నర్సాపూర్
భరోసా కలిగింది..
నేను మేజర్ కావడంతో నాకు సైతం నష్టపరిహారం కింద డబ్బులు అందించిన్రు. కొద్ది రోజుల కిందట నా అకౌంట్లో డబ్బులు పడ్డయ్. చాలా సంతోషంగా ఉంది. మా ఇంట్లో వాళ్లకు ఇవి కచ్చితంగా ఉపయోగపడ్తయ్. వాటిని దుబారా ఖర్చులకు వినియోగించకుండా ఏవైనా అవసరాలకు వాడుకుం టం. ఈ పరిహారం డబ్బులతో భవిష్యత్ మీద భరోసా ఏర్పడింది. సింగరేణి యాజమాన్యానికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– టేకం పగ్గుబాయి, అబ్బాపూర్, తాండూర్