హుజూరాబాద్టౌన్, మే 21: దళిత బంధు యూనిట్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పట్టణంలో దళిత బంధు లబ్ధిదారులు అందె సరోజన-ప్రభాకర్ సెంట్రింగ్ షాపు, ఇమ్మడి తిరుమల-దేవేందర్ బోటిక్, లేడీస్ టైలర్ దుకాణం, కుమ్మరి సమ్మక-శంకరయ్య మెడికల్ షాపు ఏర్పాటు చేయగా, బోరగాల రేణుక కారు కొనుగోలు చేశారు. కాగా, యూనిట్లను శనివారం రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనందిస్తూ వారిలో స్వయం ఉపాధి మార్గాన్ని ముందుండి నడిపిస్తున్నదన్నారు. దళితులంతా సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక-శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, జడ్పీటీసీ పడిదం బాక్కారెడ్డి, సర్పంచ్ ప్రభావతిరెడ్డి, కౌన్సిలర్లు ముకా రమేశ్, మొలుగు సృజన, వెన్నంపల్లి(పాల) కిషన్, మారేపల్లి సుశీల, కళ్లెపల్లి రమాదేవి, తాళ్లపల్లి శ్రీనివాస్, గోవిందుల స్వప్న, మక్కపెల్లి కుమార్యాదవ్, బర్మావత్ యాదగిరినాయక్, నాయకులు కృష్ణ, గోవిందుల భాస్కర్, దళిత సంఘాల నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.