కార్పొరేషన్, జూలై 27: నిరుపేదల కడుపు నింపడమే టీఆర్ఎస్ సర్కారు లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. అర్హులందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని చెప్పారు. సుభాష్నగర్ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం లబ్ధిదారులకు రేషన్కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. దేశంలోనే ఎక్కడాలేనివిధంగా ఒకేసారి 3,09,083 ఆహార భద్రత కార్డులు ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రాష్ట్రంలో 87లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని, 2.79కోట్ల మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు. కేంద్రం 53 లక్షల కార్డుల మంజూరుకు అనుమతించగా, సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో మరో 35 లక్షల మందికి అందించామని చెప్పారు.
కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 1811 కొత్త కార్డులు జారీ చేశామని పేర్కొన్నారు. కార్డుల్లో అదనంగా కుటుంబసభ్యులను చేర్పించేందుకు త్వరలోనే అవకాశం కల్పిస్తామన్నారు. గత పాలకులు కార్డుకు 20 కిలోల బియ్యం ఇస్తే, తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కరికీ 6 కిలోల బియ్యం ఇస్తూ పేదల కడుపునింపుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీరు అందుబాటులోకి రావడం, 24 గంటల ఉచిత కరెంట్తో రికార్డుస్థాయిలో 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుందన్నారు. ఏడేండ్లలోనే దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరామన్నారు.
అన్నివర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్ కిట్, షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాలను ఉదహరించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, మేయర్ సునీల్రావు, అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్లాల్, బల్దియా కమిషనర్ క్రాంతి, జిల్లా పౌర సరఫరాల అధికారి సురేశ్రెడ్డి, సివిల్ సప్లయ్ డీఎం శ్రీకాంత్రెడ్డి, కార్పొరేటర్లు అర్ష కిరణ్మయి మల్లేశం, గంట కళ్యాణి. గందె మాధవి, ఐలేందర్యాదవ్, నేతలు మేచినేని అశోక్రావు, వంగల పవన్, అర్బన్ తహసీల్దార్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.