హుజూరాబాద్ టౌన్, జూలై 21: టీపీసీసీ మాజీ కార్యదర్శి, కాంగ్రెస్ నియోజకవర్గ మాజీ ఇన్చార్జి పాడి కౌశిక్రెడ్డి బుధవారం టీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. అలాగే, కౌశిక్రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఆయన అనుచరులు, అభిమానులు దాదాపు ఏడు వేల మంది 800 వాహనాల్లో ప్రగతి భవన్కు తరలివెళ్లారు. సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. కౌశిక్తోపాటు డీసీసీ వరింగ్ ప్రెసిడెంట్ పీ సత్యనారాయణరావు, జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ పోడేటి రామస్వామి, టీపీసీసీ కార్యదర్శి తక్కళ్లపల్లి సత్యనారాయణరావు, టీపీసీసీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ అబ్దుల్లాఖాన్, హుజూరాబాద్ మండలం కాట్రపల్లికి చెందిన ఎంపీటీసీ దంపతులు రావుల అనిత-వెంకట్, హుజూరాబాద్కు చెందిన మాజీ కౌన్సిలర్ చింతా శ్రీనివాస్, ఎన్ఎస్యూఐ మండలాధ్యక్షుడు ఎండీ అర్షద్ఖాన్, వీణవంక ఉప సర్పంచ్ భానుచందర్, రామకృష్ణాపూర్ సర్పంచ్ మేకల సమ్మిరెడ్డి, ఇల్లందకుంట మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మర్రి శ్రీనివాస్రెడ్డి, హుజూరాబాద్కు చెందిన సీనియర్ నాయకులు నిమ్మటూరి సాయికృష్ణ, రావుల యాదగిరి, తాటిపాముల రమేశ్, బొంగోని సంతోష్ కుమార్, సంతోష్, సాగర్రెడ్డి పార్టీలో చేరారు.