బోయినపల్లి, అక్టోబర్ 4: కల్యాణలక్ష్మి పథకంతో పేద కుటుంబాల్లో కల్యాణకాంతులు నిండుతున్నాయని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. మండలంలోని తడగొండలో ఇద్దరికి ఎమ్మెల్యే రవిశంకర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావు కల్యాణలక్ష్మి చెక్కులను అందించారు. గ్రామానికి వచ్చిన వారికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి చక్కెర కుడుకలు పోశారు. కల్యాణలక్ష్మితో ప్రతి కుటుంబం సంతోషంగా ఉన్నదని, బాల్య వివాహాలు పూర్తిగా నిలిచిపోయాయని తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీసీ రోడ్డు పనులు, డ్రైనేజీ నిర్మాణ పనులను భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావు, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు కొనుకటి లచ్చిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ లెంకల సత్యానారాయణ రెడ్డి, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, ఆర్ఐ రాజశేఖర్, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, టీఆర్ఎస్ జిల్లా నాయకులు అనుముల భాస్కర్, సర్పంచులు చిందం రమేశ్, కన్నం మధు, ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్, అక్కెనపల్లి ఉపేందర్, కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ అజ్జు, ఎస్సీ ఎస్టీ అట్రసిటి కమీటీ సభ్యుడు కొట్టెపల్లి సుధాకర్, మాజీ సెస్ డైరెక్టర్ మేడుదుల మల్లెశం, టీఆర్ఎస్ నాయకులు స్వామి, లక్ష్మీరాజం, శంకర్, రాములు, మధు, శ్రీనివాసరెడ్డి ఉన్నారు.