కోరుట్ల, సెప్టెంబర్ 27: కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, వృద్ధులు, దివ్యాంగ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. అడగకముందే సంక్షేమ పథకాల రూపంలో గడగడపకూ వరాలు ఇస్తున్న ఘనత ఆయనకే దక్కిందని చెప్పారు. కోరుట్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే విద్యాసాగర్రావుతో కలిసి మంగళవారం ఉమ్మడి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అవగాహన లేని కొందరు ప్రతిపక్ష పార్టీల నాయకులు బతుకమ్మ చీరెలపై నోరు పారేసుకోవడం బాధాకరమన్నారు. అతివల ఆత్మగౌరవాన్ని ఇనుముడింపజేయడం, నేత కార్మికులకు చేతినిండా పనికల్పించడమే ధ్యేయంగా సర్కారు చీరెలు పంపిణీ చేస్తున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అనే తారతమ్య ం లేకుండా అన్ని పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నారన్నారు. ఆయన చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ప్రజలందరూ టీఆర్ఎస్ సర్కారును ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్బీఎస్ జిల్లా కోఆర్డినేటర్ చీటి వెంకట్రావు, ఎంపీపీ తోట నారాయణ, వైస్ ఎంపీపీ చీటి స్వరూప, జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, డీఆర్డీవో వినోద్కుమార్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్, టీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు నత్తి రాజ్కుమార్, టీఆర్ఎస్ మండలాధ్యక్షురాలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.