హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమా ర్ జన్మదినం సందర్భంగా శుక్రవారం శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. తన సతీమణి డాక్టర్ మాధవి తో కలిసి వచ్చి, ప్రత్యేక పూజలు చేశారు. ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారు లు, పూజల అనంతరం శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి చిత్ర పటాన్ని బహూకరించారు. అంతకుముందు గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా సతీమణితో కలిసి వినోద్ కుమార్ శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ ప్రాం గణంలో మొకలు నాటారు. తెలంగాణ రాష్ట్రం గ్రీనరీతో సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని ఆకాంక్షించారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమా ర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండి యా చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా మొకలు నాటినట్లు వెల్లడించారు.