కొత్తపల్లి, ఏప్రిల్ 25: కరీంనగర్ భగత్నగర్లోని వివేకానంద విద్యానికేతన్ పాఠశాలలో 2000-01 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం కరోనా నేపథ్యంలో అనాథలకు చేయూతనందించారు. నగరంలోని బైపాస్ రోడ్డులో గల వీరబ్రహ్మేంద్రస్వామి అనాథ వృద్ధాశ్రమం, సుభాష్నగర్లోని ఎన్జీవోలో, గీతాభవన్ వద్ద గల అనాథ ఆశ్రమంలోని వారికి రూ.15వేల విలువైన నిత్యావసర వస్తువులను అందజేశారు. నిరుపేదలు, వృద్ధులు, అనాథలకు సేవ చేయడం సంతృప్తినిచ్చిందని వారు పేర్కొన్నారు. పూర్వ విద్యార్థులు బూస శ్రీకాంత్, కొత్తకొండ శ్రీకాంత్, గడప సురేశ్, రుద్రాక్ష చంద్రశేఖర్, ఉయ్యాల విష్ణువర్ధన్, రాకం రవీందర్, డాక్టర్ హరీశ్, శరణ్య, శ్రీలత, విమల తదితరులున్నారు.