కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 24: కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య పేర్కొన్నారు. శనివారం కరీంనగర్ మండలం బొమ్మకల్లో కరీంనగర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీతోపాటు జడ్పీటీసీ పురుమల్ల లలిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. జడ్పీటీసీ పురుమల్ల లలిత మాట్లాడుతూ.. కేంద్రాలకు వచ్చే రైతులు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. పీఏసీఎస్ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్రెడ్డి, సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్, ఎంపీటీసీలు ర్యాకం లక్ష్మి, వ్యవసాయాధికారి సత్యం, విండో వైస్ చైర్మన్ బీరం ఆంజనేయులు, ఉపసర్పంచ్ ఇతియాఖ్ అహ్మద్, వార్డు సభ్యులు జక్కినిపల్లి శంకర్, జోజిరెడ్డి, ర్యాకం మోహన్, హమాలీ సంఘ నాయకులు, ట్రాక్టర్ యజమానులు పాల్గొన్నారు.
గంగాధర, ఏప్రిల్ 24: గట్టుభూత్కూర్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వైస్ ఎంపీపీ కంకణాల రాజ్గోపాల్రెడ్డి, సర్పంచ్ కంకణాల విజేందర్రెడ్డి శనివారం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలని సూచించారు. కరోనా సమయంలో కూడా రైతులు ఇబ్బంది పడకుండా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయడం అభినందనీయమ న్నారు. కార్యక్రమంలో కేంద్రం నిర్వాహకులు జ్యోతి, రాణి, మల్లమ్మ, రాజు తదితరులున్నారు.