సీఎస్ సోమేశ్కుమార్కు జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ వినతి
కమాన్పూర్, మార్చి 22: నాగారం పంచాయతీ పరిధిలోని లింగాల రెవెన్యూ గ్రామ పరిధిలో గల 108 ఎకరాల ప్రభుత్వ భూమిని తిరిగి రైతులకే అందించాలని సీఎస్ సోమేశ్ కుమార్ను జడ్పీ చైర్మన్ పుట్టమధు కోరారు. ఈ మేరకు హైదరాబాద్లోని బీఆర్కే భవనంలో సోమవారం సీఎస్కు పుట్టమధు వినతి పత్రం అందజేశారు. లింగాల రెవెన్యూ గ్రామ పరిధిలోని 108 ఎకరాల భూమిని సింగరేణి నిర్వాసిత గ్రా మాల పునరుద్ధరణలో భాగంగా ఐదేళ్ల క్రితం అప్పగించేందుకు నిర్ణయం జరిగిందని, ఈ భూమిని సింగరేణి సంస్థ స్వాధీనం చేసుకునేందుకు గతంలో సంసిద్ధత తెలిపిందని పేర్కొన్నారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో భాగంగా సింగరేణి నిర్వాసిత గ్రామా లైన పెద్దంపేట, మంగళ్పల్లె గ్రామాల ప్రజలకు పునరావాసం ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని తెలిపారు. ఈ క్రమంలోనే ఆ సింగరేణి నిర్వాసిత గ్రామాల ప్రజలు లింగాల ప్రాంత భూముల్లో నివాసం ఏర్పాటు కోసం స్థలం పొందేందు కు సుముఖత వ్యక్తం చేయలేదని తెలియ జేశారు. ఈ తరుణం లో సింగరేణి సంస్థ కూడా ఆ భూములు తమకు అవసరం లేదని తేల్చి చెప్పిందని, ఇందుకు సంబంధిం చి ప్రభుత్వానికి నివేదికను కూడా సింగరేణి సంస్థ అందజేసిం దని గుర్తుచేశా రు. ఆ భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు తిరిగి హక్కు కల్పిస్తూ పట్టా పుస్తకాలను అందజేయాలని, రైతు బంధు, రైతు బీమా కూడా వర్తింపజేయాలని పుట్ట మధూకర్ కోరారు.