మా బతుకులు బాగుజేయాల్నని సీఎం కేసీఆర్ దళితబంధు పెడ్తె అందరం సంబురపడ్డం. సర్కారు ఇచ్చే పది లచ్చలతోటి మంచిగ బతుకచ్చని మురిసినం. గింతల్నే గా ఈటల రాజేందర్ కండ్లుమండినట్టున్నయ్. మేం బాగుపడుడు నచ్చనట్టున్నది. అందుకే పథకాన్ని ఆపేందుకు కుట్రలు పన్నిండు. మొదటనేమో ఇది ఎన్నికల పథకం అన్నడు.
తర్వాత కొందరికే వస్తదన్నడు. ఖాతాలల్ల పైసలు
ఎయ్యరని, ఏసినా తీసుకుంటరని చెప్పిండు. ఓసారేమో వేరేటోళ్లతోని, ఇంకోసారి ఆయనే లేఖలు రాసిండు. ఇప్పుడు కండ్లమంట సల్లారినట్టున్నది. ఇట్ల పథకాన్ని ఆపేయించుడు ఏమన్న
న్యాయమేనా..? కడుపుల ఇంత ఇషం పెట్టుకొని ఇన్ని రోజులు తియ్యగ మాట్లాడినవా..? బ్యాంకు అకౌంట్ల పైసలు వడి.. పనులు కూడ అయ్యేమోపుకు నోటికాడి బుక్క ఎత్తగొడ్తివి. మమ్ముల బాధపెడ్తివి. మా కంచంల మన్నుగొట్టి నువ్వేం బాగుపడ్తవ్? మా ఉసురు తాకి పోతవ్. మళ్ల ఏం మొఖం పెట్టుకొని ఓట్లకు అత్తవో సూత్తం. మా వాడల అడుగువెడ్తే సావుడప్పు కొట్టి నిలదీస్త.
కుట్రలపై దళితుల భగ్గుమన్నారు. రాజేందర్ సహా ఇతర బీజేపీ నేతలు దళితబంధును నిలిపివేయాలని లేఖలు రాసి తమ నోటికాడి బుక్కను ఎత్తగొట్టేందుకు కుట్రలు చేశారంటూ దుమ్మెత్తిపోశారు. ఓట్లు అడిగేందుకు దళితవాడలకు ఈటల వస్తే తరిమికొడుతా మంటూ హెచ్చరించారు. ‘దళితబంధు ముద్దు.. ఈటల వద్దు’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. తినే కంచంలో మన్ను పోశాడని ఈటలకు దళిత మహిళలు శాపనార్థాలు పెట్టారు. ఈ ఎన్నికల్లో తమ తడాఖా చూపిస్తామని ముక్తకంఠంతో దళితులు హెచ్చరించారు. దళిత బంధు కొనసాగించేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఈటల లేఖ రాయాలని నినదించారు. దళితులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ఈ పథకం ప్రవేశపెడితే, మొదటి నుంచి బీజేపీ నాయకులు కుట్రలకు తెరలేపారని దుమ్మెత్తిపోశారు. దళితులు బాగుపడితే తమ రాజకీయాలు సాగవని కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ లేఖ రాసి దళితబంధు నిలిపివేయించిందని మండిపడ్డారు.