చొప్పదండి, ఏప్రిల్ 18: ప్రజారోగ్యమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని రాగంపేట గ్రామానికి చెందిన దీకొండ స్వామికి చికిత్స కోసం రూ. లక్ష ఎల్వోసీ మంజూరైంది. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం స్వామి కుటుంబసభ్యులకు ఆయన ఎల్వోసీ మంజూరు పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేద కుటుంబానికి చెందిన స్వామి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేసుకోవడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నట్లు స్థానిక నాయకులు తన దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. వెంటనే ఎల్వోసీకి దరఖాస్తు చేయగా రూ.లక్ష మంజూరైనట్లు పేర్కొన్నారు. నిరుపేదలు కూడా కార్పొరేట్ దవాఖానల్లో చికిత్స పొంది ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగానే సీఎంఆర్ఎఫ్, ఎల్వోసీ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక సాయం మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి దవాఖానల్లో చికిత్స పొందిన వారు సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్గౌడ్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్రెడ్డి, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ గొల్లపల్లి శ్రావణ్కుమార్, నాయకులు అంజయ్య, మావురం మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
గంగాధర, ఏప్రిల్ 18: రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని కొండన్నపల్లి, మల్లాపూర్, గోపాల్రావుపల్లి, వెంకంపల్లి, చెర్లపల్లి(ఎన్), చెర్లపల్లి(ఆర్), కొండాయపల్లి, బూరుగుపల్లి గ్రామాల్లో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, వ్యవసాయాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. ధాన్యం దిగుబడికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు.
కేంద్రాల్లో రైతులు కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. ఏఎంసీ చైర్మన్ సాగి మహిపాల్రావు, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ పుల్కం నర్సయ్య, సింగిల్ విండో చైర్మన్లు దూలం బాలాగౌడ్, వెలిచాల తిర్మల్రావు, ఆర్బీఎస్ మండల కో-ఆర్డినేటర్ పుల్కం గంగన్న, వైస్ ఎంపీపీ కంకణాల రాజ్గోపాల్రెడ్డి, సింగిల్ విండో, ఏఎంసీ వైస్ చైర్మన్లు వేముల భాస్కర్, తాళ్ల సురేశ్, సర్పంచులు మేచినేని నవీన్రావు, రేండ్ల జమున, మడ్లపెల్లి గంగాధర్, ముక్కెర మల్లేశం, వేముల దామోదర్, శ్రీమల్ల మేఘరాజు, ఆకుల శంకరయ్య, రాసూరి మల్లేశం, పొట్టల కనకయ్య, ఎంపీటీసీలు ద్యావ మధుసూదన్రెడ్డి, అట్ల రాజిరెడ్డి, నాయకులు శేఖర్రెడ్డి, శ్రీనివాస్, సురేందర్, అంజి, నగేశ్ తదితరులు పాల్గొన్నారు.