ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
ఎల్వోసీ మంజూరు పత్రాలు అందజేత
చొప్పదండి, ఏప్రిల్ 15: పేదలకు తెలంగాణ సర్కారు అండగా ఉంటుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. చొప్పదండి పట్టణానికి చెందిన మేఘన అనారోగ్యంతో బాధపడుతుండగా శస్త్ర చికిత్స కోసం రూ.95 వేల ఎల్వోసీ మంజూరైంది. గురువారం మేఘన కుటుంబసభ్యులకు ఎల్వోసీ మంజూరు పత్రాన్ని ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మేఘన కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి నా దృష్టికి తీసుకురాగా, రూ.95 వేల ఎల్వోసీ మంజూరు చేయించినట్లు తెలిపారు. పేదలను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్రెడ్డి, నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్, మహేశుని మల్లేశం, చెట్టిపల్లి పద్మ, మావురం మహేశ్, పిట్టల వెంకటేశ్, మంద శ్రీరాం, కొండాల్ తదితరులు పాల్గొన్నారు.
గంగాధర, ఏప్రిల్ 15 : మండలంలోని ఆచంపల్లి గ్రామానికి చెందిన వెంకటి అనారోగ్యంతో నిమ్స్లో చికిత్స పొందుతున్నాడు. రూ. రెండు లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలుపగా విషయం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే రూ. రెండు లక్షల ఎల్వోసీ మంజూరు చేయించారు. చొప్పదండిలోని క్యాంపు కార్యాలయంలో వెంకటి కుటుంబ సభ్యులకు ఎల్వోసీ మంజూరు పత్రం అందజేశారు. ఎల్వోసీతో ఆదుకున్న ఎమ్మెల్యేకు వెంకటి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్రావు, సర్పంచ్ కొంకటి శంకర్, ఎంపీటీసీ కోలపురం లక్ష్మణ్, నాయకులు మధుసూదన్, మల్లేశం, ఆరె రాజశేఖర్, సురేందర్ ఉన్నారు.
ఇవి కూడా చదవండి
బ్రాండెడ్ పేరుతో నకిలీ మాస్కుల తయారీ.. ఇద్దరి అరెస్టు
నాచగిరి హుండీ ఆదాయం రూ.16 లక్షల 96 వేలు