వీణవంక, ఏప్రిల్ 15: కరోనా సెకండ్వేవ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి వైరస్ కట్టడికి సహకరించాలని జడ్పీటీసీ సభ్యురాలు మాడ వనమాల అన్నారు. మండలంలోని చల్లూరు పీ హెచ్సీలో గురువారం ఆమె వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడా రు. సీఎం కేసీఆర్, వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట ల రాజేందర్ కరోనా నియంత్రణపై దృష్టి పెట్టారని పేర్కొన్నారు. 45 ఏండ్లు పైబడిన వారందరూ తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని సూచించారు. కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. మాస్క్లు ధరించాలని, శానిటైజర్తో తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని, నిర్ణీత దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. వైరస్ నియంత్రణకు నిర్విరామంగా శ్రమిస్తున్న వైద్య సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించారు. వీణవంక పీహెచ్సీలో కో ఆప్షన్ మెంబర్ అబ్దుల్ హమీద్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. వీణవంక, చల్లూరు పీహెచ్సీల్లో మొత్తం 240 మందికి కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు వైద్యులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
బ్రాండెడ్ పేరుతో నకిలీ మాస్కుల తయారీ.. ఇద్దరి అరెస్టు
ఐసీసీ షాకింగ్.. మ్యాచ్ ఫిక్సింగ్లో బిట్ కాయిన్