హుజురాబాద్,మే 12: కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం తలపెట్టిన లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతున్నది. నిత్యం రద్దీతో ఉండే బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, డీసీఎంఎస్ కాంపెక్స్తో పాటు జమ్మికుంట, కరీంనగర్, వరంగల్ ప్రధాన రహదారులు ఉదయం 10 గంటల తర్వాత నిర్మానుష్యంగా మారాయి. అన్ని వ్యాపార, వాణిజ్య సముదాయాలు నిర్ణీత గడువులోగా మూసివేశారు.
పట్టణంలో ..
హుజూరాబాద్టౌన్, మే12: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం విధించిన రాష్ట్ర వ్యాప్త లాక్డౌన్ హుజూరాబాద్ పట్టణంలో మొదటి రోజు బుధవారం విజయవంతమైంది. ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం నుంచి డిపోకే పరిమితం కాగా బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, ప్రధాన దుకాణ సముదాయాలు డీసీఎంఎస్ , ఈటల, ఉస్మాన్సేట్ షాపింగ్ కాంప్లెక్స్లు బంద్ పాటించగా, హుజూరాబాద్-జమ్మికుంట, సైదాపూర్ రోడ్, కరీంనగర్, వరంగల్ ప్రధాన రహదారులు జనంలేక వెలవెల బోయాయి. టౌన్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించగా ఏసీపీ కోట్ల వెంకట్రెడ్డి పర్యవేక్షించారు. పలువురు వాహనదారులు రోడ్ల మీదకు రావడంతో జరిమానాలు విధించారు. మున్సిపల్ ఆధ్వర్యంలో హైపో క్లోరైట్ ద్రావణం పిచికారీ చేశారు. ఈ నెల 22 వరకు లాక్ ఉంటుందని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. ఆర్డీవో రవీందర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధికాశ్రీనివాస్, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, ఎస్సై చీనానాయక్, తహసీల్దార్ రాంరెడ్డి, ఎంపీడీవో రమేశ్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
హుజూరాబాద్ మండలంలో..
ప్రభుత్వం బుధవారం నుంచి చేపట్టిన లాక్డౌన్ మండలంలోని అన్ని గ్రామాల్లో సక్సెస్ అయింది. ఉదయం 10 గంటల తర్వాత అన్ని దుకాణాలు మూసి వేశారు. ప్రజలు ఇండ్లలోనే ఉన్నారు. కారోబార్లు, పంచాయతీ సిబ్బంది గ్రామంలో తిరుగుతూ ఎవరైనా రోడ్లపై కనబడితే ఇండ్లలోకి పంపించారు.
సైదాపూర్లో..
సైదాపూర్, మే 12: దుష్ట కరోనాకు దూరంగా ఉండడమే సరైన మందని ఎస్సై ప్రశాంత్రావు పేర్కొన్నారు. లాక్డౌన్లో భాగంగా బుధవారం పలు గ్రామాల్లో పర్యటించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అవసరమైతేనే గడప దాటాలని ప్రజలకు సూచించారు. ప్రభుత్వం కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటుందన్నారు.
జమ్మికుంటలో..
జమ్మికుంట: తొలిరోజు బుధవారం లాక్డౌన్ విజయవంతమైంది. ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు మాత్రమే ప్రజలు రోడ్ల మీదకు వచ్చి సరుకులు కొనుగోలు చేశారు. సీఐ రమేశ్ ఆధ్వర్యంలో పోలీసులు పరిస్థితులను సమీక్షించారు. రోడ్ల మీదకు వచ్చిన ప్రజలను ప్రశ్నించి, సరైన కారణాలు చెప్పినవారిని వదిలేశారు.
ఇల్లందకుంటలో..
ఇల్లందకుంట: మే12: కరోనా కట్టడికి ప్రభుత్వం పది రోజుల పాటు లాక్డౌన్ విధించడంతో మండల కేంద్రంలో ఉదయం 10 గంటల తర్వాత అన్ని షాపులు మూసివేశారు. ఎస్ఐ ప్రవీణ్రాజ్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. లాక్డౌన్కు ప్రజలు సహకరించాలని కోరారు.
వీణవంకలో..
వీణవంక, మే 12: మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో బుధవారం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు అన్ని షాప్లు తెరిచి ఉండడంతో ప్రజలు నిత్యావసర సరుకులు తీసుకెళ్లారు. ఎస్ఐ కిరణ్రెడ్డి పర్యవేక్షణలో పోలీసులు కరోనా కట్టడికి తగిన చర్యలు తీసుకున్నారు.
10 రోజుల వరకు లాక్డౌన్…
జమ్మికుంట రూరల్,మే 12: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో 10 రోజుల పాటు లాక్డౌన్ విధించారు. ప్రజలు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు నిత్యావసర సరుకులు కొనుగోలు చేశారు. 10 గంటల తర్వాత మండల పరిధిలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.