ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి
ఇల్లందకుంట, జూన్ 12: ముఖ్యమంత్రి కేసీఆర్తోనే రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తున్నదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ఉద్ఘాటించారు. దేశంలో మరే రాష్ట్రం లో లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్దేనని కొనియాడారు. ఇల్లందకుంట మండలం టేకుర్తిలో చిన్నకోమటిపల్లి, గడ్డివాణిపల్లి గ్రామాలకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో శనివారం సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక పదవులు, గౌరవాన్ని పొందిన ఈటల రాజేందర్ పార్టీపై ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. “ఇప్పుడు ఆత్మరక్షణ కోసం బీజేపీలోకి వెళ్తున్నావు.. కమ్యూనిస్టు భావాలున్న నీవు ఆ పార్టీలో ఎలా చేరుతావని’ ప్రశ్నించారు.
రైతుబంధు ధనికులకు ఇవ్వద్దన్నని ఆయన మాత్రం 3లక్షలు తీసుకోవడం సిగ్గు చేటన్నారు. సంక్షేమ కార్యక్రమాలపై విమర్శించడం మానుకోవాలని హితవుపలికారు. వృద్ధులకు పింఛన్లు ఇస్తూ ఆత్మగౌరవం కల్పిస్తున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే రవికుమార్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్రావు, జడ్పీ చైర్పర్సన్ విజయ, జనగాం జడ్పీ చైర్మన్ సంపత్రెడ్డి, గ్రంథాలయ చైర్మన్లు ఏనుగు రవీందర్రెడ్డి, రవీందర్, జడ్పీటీసీ సరిత, సర్పంచులు వనమాల, లలిత, దిలీప్రెడ్డి, మానస, వెంకటస్వామి, ఎంపీసీలు సంజీవరెడ్డి, ఓదెలు, చిన్నరాయుడు, రమ, విజయ, టీఆర్ఎస్ నాయకులు గణపతి, వాసుదేవరెడ్డి, వీరారెడ్డి, వీరన్న రమేశ్, వాసు, మహేందర్, కుమార్, వీరస్వామి, తిరుపతిరెడ్డి, టీఆర్ఎస్వీ నియోజకవర్గ ఇన్చార్జి అలేటి శ్రీరాం, తదితరులు ఉన్నారు.