రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్
పోతారంలో రాజ్యాంగ నిర్మాత విగ్రహావిష్కరణ
తక్కళ్లపల్లిలో గోదాం ప్రారంభం
పాల్గొన్న జడ్పీ చైర్పర్సన్ వసంత, మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ బాపురెడ్డి
కథలాపూర్, ఏప్రిల్ 11: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా యువత ముందుకు సాగాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. ఆదివారం కథలాపూర్ మండలం పోతారం గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. అంతకుముందు తక్కళ్లపెల్లి గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో రూ.16.50 లక్షలతో నిర్మించిన గోదాంను ప్రారంభించారు. అలాగే తొమ్మిది మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. తాండ్య్రాల గ్రామంలోని పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ… అంబేద్కర్ అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేశారని, భావితరాలకు ఆయన జీవిత చరిత్రను వివరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. యువత మహనీయుల బాటలో నడువాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక గురుకుల పాఠశాలలు అభివృద్ధి చెందాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగి సస్యశ్యామలం కావడంతో అదనంగా 24 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాంలు నిర్మించామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 40వేల మెట్రిక్ టన్నుల కెపాసిటీ గల గోదాంలు నిర్మించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని పేర్కొన్నారు. తాండ్య్రాల గ్రామంలోని పల్లెప్రకృతి వనంలో ఏర్పాటు చేసిన ఎడ్లబండి, మంచినీళ్ల బావి, ఇసుర్రాయి, మొక్కలను పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ గడిల గంగప్రసాద్ను అభినందించారు. జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా పోతారంలో ఫూలే చిత్రపటానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ పాటల సీడీని ఆవిష్కరించారు. కార్యక్రమాల్లో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, కోరుట్ల ఆర్డీవో వినోద్కుమార్, మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, ఎంపీపీ జవ్వాజి రేవతి, జడ్పీటీసీ సభ్యుడు నాగం భూమయ్య, జడ్పీ వైస్ చైర్మన్ వొద్దినేని హరిచరణ్రావు, వైస్ ఎంపీపీ గండ్ర కిరణ్రావు, కోరుట్ల సీఐ రాజశేఖర్రాజు, తహసీల్దార్ దూలం మధు, సింగిల్విండో చైర్మన్ చుక్క దేవరాజం, సర్పంచులు మొలిగె లక్ష్మి, ధర్మపురి జలేందర్, గడిగ గంగప్రసాద్, ఎంపీటీసీలు జిల్లా లక్ష్మి, పులి శిరీష, అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కార్యదర్శి ముద్దాం ప్రకాశ్, నాయకులు బలిజ రాజారెడ్డి, సింగారపు చిన్నయ్య, బత్తుల నరేశ్, పాలెపు రాజేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కల్లెడ శంకర్, నాయకులు నాంపెల్లి లింబాద్రి, గుండారపు గంగాధర్, ఎండీ రఫీ, గంగాధర్, జలేందర్, రాజ్కుమార్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
14వ అంతస్తులో అగ్నిప్రమాదం.. అప్రమత్తతతో తప్పిన ముప్పు
అరణ్య క్లోజింగ్ కలెక్షన్స్ ఎంతంటే..