లబ్ధిదారులకు భరోసానిచ్చేందుకే సీఎం రిలీఫ్ ఫండ్ పథకం
మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
మానకొండూర్ రూరల్, జూన్ 5: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కష్ట కాలంలో ప్రజల అవసరాలను గుర్తించిన సీఎం కేసీఆర్ రేషన్ షాపుల్లో బియ్యాన్ని ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. కొండపల్కలలో శనివారం రేషన్ షాపుల్లో బియ్యాన్ని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సర్పంచ్ నల్ల వంశీధర్రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లాక్డౌన్లో ప్రజలకు ఉచితంగా బియ్యాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం గ్రామానికి చెందిన వేముల చంద్రమౌళికి రూ. 22 వేలు, దావెల్ల లక్ష్మణ్కు రూ. 22,500, గంగిపల్లి గ్రామానికి చెందిన తాడూరు స్వప్పకు రూ. 56 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు ఇండ్లకువెళ్లి అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన చికిత్స కోసం పైవేట్ దవాఖానల్లో చేరినవారు సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోవడంతో చెక్కులు మంజూరు చేశామని గుర్తు చేశారు. గొప్ప మనసుతో సీఎం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. చెక్కులు అందుకున్న బాధిత కుటుంబాలు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావుకు కృతజ్ఞతలు తెలిపారు.
వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే
మానకొండూర్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో శనివారం జరిగిన వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక్కడ జడ్పీటీసీ శేఖర్గౌడ్, రైతుబంధు సమితి గ్రామ కన్వీనర్ కడారి ప్రభాకర్, మానకొండూర్ పీఏసీఎస్ వైస్ చైర్మన్ పంజాల శ్రీనివాస్గౌడ్, గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లగొండ తిరుపతిగౌడ్, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు బొల్లం శ్రీనివాస్గౌడ్, నాయకులు మాశం సాగర్, అఖిల్, దాసరి శ్రీనివాస్, ఇనుమల్ల సంపత్, గ్రామస్తులు పాల్గొన్నారు.
పేదలకు ఇబ్బంది లేకుండా..
తిమ్మాపూర్ రూరల్, జూన్ 5: లాక్డౌన్ నేపథ్యంలో పేద ప్రజలు ఇబ్బంది పడవద్దనే ఉద్దేశంతో రేషన్ బియ్యం ఉచితంగా అందజేస్తున్నామని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మహాత్మానగర్లో రేషన్ షాపు వద్ద కార్డుదారులకు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా, లాక్డౌన్తో పేదప్రజలు ఇబ్బంది పడవద్దనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజ్కుమార్, ఇఫ్కో రాష్ట్ర డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్రెడ్డి, సర్పంచ్ జక్కని శ్రీవాణీరవీందర్, రావుల రమేశ్, ఉపసర్పంచ్ మడుపు శ్రీనివాస్రెడ్డి, నాయిని వెంకట్రెడ్డి, వేల్పుల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.