అద్భుతంగా పనిచేశారు
జాతీయ అవార్డుకు ఎంపికైన మండల పరిషత్లు, పంచాయతీలకు సీఎం కేసీఆర్ అభినందనలు
పుష్పగుచ్ఛాలు అందించి సన్మానం
పెద్దపల్లి, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ)/ధర్మారం/ తిమ్మాపూర్ రూరల్/ముస్తాబాద్/ ఎల్లారెడ్డిపేట/ కోరుట్లరూరల్: జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న ఉమ్మడి జిల్లాలోని మండల పరిషత్లు, పంచాయతీ పాలకవర్గాలను సీఎం కేసీఆర్ అభినందించారు. శుక్రవారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ప్రజాప్రతినిధులు, అధికారులకు పుష్పగుచ్ఛాలు అందించి ‘వెల్డన్.. అద్భుతంగా పనిచేశారు’ అంటూ కితాబిచ్చారు. దీన్ దయాళ్ ఉపాధ్యా య సశక్తికరణ్ అవార్డు వరించిన ధర్మారం, కోరుట్ల మం డల పరిషత్లు, ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్నగర్, ముస్తాబాద్ మండలం మోహినికుంట, తిమ్మాపూర్ మండలం పర్లపల్లి పంచాయతీ పాలకవర్గాలు, అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఎవరెవరు కలిశారంటే..
ధర్మారం ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, ఎంపీడీవో జయశీల, డీపీవో గీతను సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ శాలువాలతో సత్కరించగా, సీఎం కేసీఆర్ అభినందించారు. కోరుట్ల ఎంపీపీ తోట నారాయణ, ఎంపీడీవో శ్రీనివాస్ను సన్మానించారు. హరిదాస్నగర్ సర్పంచ్ తెడ్డు అమృతను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఆమె వెంట పంచాయతీ కార్యదర్శి నదియా, నా యకుడు తెడ్డు రాజమల్లు ఉన్నారు. ఇక డబుల్ ధమాకా సాధించిన మంథని మండలం సుందిళ్ల సర్పంచ్ దాసరి లక్ష్మి, రాజలింగు కుటుంబ సభ్యులను సత్కరించి అభినందించారు. పర్లపల్లి సర్పంచ్ మాదాడి భారతీనర్సింహారెడ్డిని, పాలకవర్గాన్ని అభినందించారు. గ్రామంలో చేసిన అభివృద్ధిని టీఆర్ఎస్ఎల్పీ కార్యదర్శి మాదాడి రమేశ్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఐక్యతతో మరింత అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కరీంనగర్ డీపీవో వీరబుచ్చయ్య, ఎంపీవో కిరణ్కుమార్, ఎంపీటీసీ ముప్పిడి సంపత్రెడ్డి, ఉపసర్పంచ్ రాజేశ్ ఉన్నారు. ఇక చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామంగా ఎంపికైన ముస్తాబాద్ మండలం మోహినికుంట సర్పంచ్ కల్వకుంట్ల వనజను అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. ఎంపీపీ జనగామ శరత్రావు, ఆర్బీఎస్ మండల కన్వీనర్ కల్వకుంట్ల గోపాల్రావు, సిరిసిల్ల డీపీవో రవీందర్, కల్వకుంట్ల సందీప్రావు ఉన్నారు.
ఇవి కూడా చూడండి..
ఆస్ట్రాజెనికాతో బ్లడ్ క్లాటింగ్.. కొత్తగా 25 కేసులు నమోదు
రిపోర్టర్లను ఏప్రిల్ ఫూల్ చేసిన జిల్ బైడెన్