రామడుగు, ఏప్రిల్ 1: మండలంలోని గోపాల్రావుపేట వేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రథోత్సవం వైభవంగా నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో స్వామి వారికి ఘన స్వాగతం పలికి కొబ్బరికాయలు కొట్టారు. పలువురు భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ నార్ల రమేశ్, వేదపండితులు శేషం మురళీధరాచార్యులు, భాస్కరాచార్యులు, అర్చకులు డింగిరి సత్యనారాయణాచార్యులు, దుర్శేటి రవికిరణాచార్యులు, భక్తులు ముదిగంటి రాజిరెడ్డి, దుండ్ర మల్లారెడ్డి, దొనపాటి సీతారాంరెడ్డి, కాసారపు బుచ్చిరాములుగౌడ్, ముదుగంటి సత్యనారాయణరెడ్డి, ఇనుగుర్తి శంకరయ్య, ఎర్రోజు సత్యనారాయణ, కొలిపాక రాములు, కమలాకర్, శ్రీనివాస్, పొన్నం రాజయ్య, ఏపూరి పరశురాములు, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.