కరీంనగర్ : హుజురాబాద్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్లోకి భారీగా వలసలు మొదలయ్యాయి. ఇవాళ కాన్పూర్, కమలాపూర్, వీణవంక, రాములపల్లి, కొత్తపల్లి గ్రామాలకు చెందిన సుమారు 200 మంది బీజేపీ కార్యకర్తలు మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. అదేవిధంగా జమ్మికుంట పట్టణంలో మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు సైతం మంత్రుల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. సీఎం కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నమ్మి ఉద్యమ పార్టీలో చేరుతున్నట్లు వారు పేర్కొన్నారు.