చొప్పదండి : జమ్మిచెట్టు పెంపకంతో మానవాళికి ఎన్నో లాభాలు ఉన్నాయని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. ఆదివారం ఆయన మండల కేంద్రంలోని శివకేశవాలయ ఆవరణలో గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ పిలుపు మేరకు ఊరు-ఊరుకో జమ్మిచెట్టు, గుడి గుడికో జమ్మిచెట్టు కార్యక్రమంలో భాగంగా జమ్మి మొక్కను నాటారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జమ్మి చెట్టు భారత ఉపఖండంలో, పశ్చిమాసియాలో పెరుగుతుందన్నారు. ప్రతి విజయదశమి రోజున తెలంగాణలో జమ్మిచెట్టు(శమిపూజ)కు పూజ నిర్వహించి, చిన్న వారు జమ్మి ఆకును పెద్ద వారికి ఇచ్చి ఆశీర్వచనం తీసుకుంటారన్నారు. ఈ చెట్టు ప్రత్యేకతను గుర్తించిన సీఎం కేసీఆర్ జమ్మిచెట్టును రాష్ట్ర వృక్షంగా ప్రకటించారన్నారు. ప్రతి ఒక్కరూ తమ గ్రామంలోని గుడి ఆవరణలో జమ్మి మొక్కను నాటి సంరక్షించాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గురం నీరజాభూమారెడ్డి, వైస్ చైర్పర్సన్ విజయలక్ష్మీసాంబయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్రెడ్డి, సర్పంచు వెల్మ నాగిరెడ్డి, నాయకులు కృష్ణహరి, రాజశేఖర్, యువరాజు, మావూరం మహేశ్, వెంకటరమణారెడ్డి, వివేకానంద యువజన సంఘం అధ్యక్షుడు దూస రాము పాల్గొన్నారు.