వేములవాడ టౌన్, ఆగస్టు 8: శ్రావణమాసం.. శివునికి అత్యంత ప్రీతికరమైన సోమవా రం కావడంతో వేములవాడ రాజన్న సన్నిధి పోటెత్తింది. రాష్ట్ర వ్యాప్తంగా 50వేలకు పైగా భక్తులు తరలిరావడంతో ఎటు చూసినా సందడి కనిపించింది. ఉదయం నుంచే తాకిడి మొ దలు కాగా, భక్తులు మొదట పవిత్ర స్నానాలాచరించారు. అనంతరం పార్వతీరాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. కోడెమొక్కు చెల్లించుకున్నారు. కల్యాణకట్టలో తలనీలా లు సమర్పించుకున్నారు. రద్దీ దృష్ట్యా ఆలయంలో ఆర్జితసేవలు, అభిషేక, అన్న, ఆకుల పూజలను రద్దు చేశారు. భీమేశ్వర, బద్దిపోచమ్మ, నగరేశ్వరాలయాల్లో స్వామి, అమ్మవార్ల ను దర్శించుకున్నారు. ఆలయ ఈవో రమాదేవి ఆధ్వర్యంలో ఏఈవోలు శ్రీనివాస్, నవీన్, పర్యవేక్షకులు నాగుల మహేశ్, తిరుపతిరావు, ఆలయ ఇన్స్పెక్టర్లు చెక్కిళ్ల అశోక్, సంకేపల్లి పవన్కుమార్ భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. సోమవారం ఒక్కరోజే రాజన్నకు సుమారు 24లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు వెల్లడించారు. డీఎస్పీ నాగేంద్రాచారి ఆధ్వర్యంలో పట్టణ సీఐ వెంకటేశ్ బందోబస్తు ఏర్పాటు చేశారు.