గోదావరిఖని, సెప్టెంబర్ 25: పేద ప్రజల ముఖాల్లో ఆనందం చూడాలన్న లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని, పేదింటి పెద్ద కొడుకువలె అనేక పథకాలు అమలు చేస్తూ, అభివృద్ధి పనులు చేస్తూ అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అభివర్ణించారు. ఆదివారం రామగుండం కార్పొరేషన్ 12, 13, 33, 34, 35వ డివిజన్లలో లబ్ధిదారులకు ఆసరా పింఛన్ మంజూరు పత్రాలు, మహిళలకు బతుకమ్మ చీరెలను అందజేసి, మాట్లాడారు.
దసరా ముందు అందిస్తున్న ఆస రా పేదింటికి ఓ పండుగలా నిలుస్తుందన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా రైతుబంధు, రైతుబీమా పథకాలు లేవని కేవలం తెలంగాణలో మాత్రమే ఉన్నాయన్నారు. అన్నివర్గాల సంక్షే మం కోసం నిత్యం శ్రమించే సీఎం కేసీఆర్ రు ణం తీర్చుకోవాలని, సందర్భం వచ్చినప్పుడు కేసీఆర్కు మద్దతుగా నిలవాలన్నారు. ఇక్కడ మేయర్ అనిల్కుమార్, కార్పొరేటర్లు దొంత శ్రీనివాస్, రాకం లత దామోదర్, బొడ్డు రజిత రవీందర్, జంజర్ల మౌనిక, నాయకులు పర్లపల్లి రవి, కళావతి, నూతి తిరుపతి, నీరటి శ్రీనివాస్, కోటేశ్వర్, రంజిత్, శ్రీనివాస్ ఉన్నారు.