ప్రభుత్వం చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం నియోజకవర్గ వ్యాప్తంగా జోరుగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా సోమవారం గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య పనులు చేపట్టగా, ప్రజాప్రతినిధులు, ప్రత్యేకాధికారులు దగ్గరుండి పరిశీలించారు. అలాగే వానకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని సూచించారు.
పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణంలోని వార్డుల్లో పారిశుధ్య, రోడ్లపకన పిచ్చిమొక్కల తొలగింపు పనులు చేపట్టారు. మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక వివిధ వార్డుల్లో పర్యటించారు. పనులను పరిశీలించారు. వానకాలం దృష్ట్యా ప్రమాదం పొంచి ఉన్నందున శిథిలమైన గృహాలను ఇంటి యజమానులు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని సూచించారు. వీధుల్లో పారిశుధ్యంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, కౌన్సిలర్లు, విద్యుత్ శాఖ ఇంజినీర్ ఎం వీరాచారి, ఇన్చార్జి మున్సిపల్ ఇంజినీర్ జీ సాంబరాజు, టౌన్ ప్లానింగ్ అధికారులు జ్యోత్స్న, అశ్వినిగాంధీ, శానిటరీ ఇన్పెక్టర్ పీ అనిల్కుమార్, హెల్త్ అసిస్టెంట్ కిషన్రావు, వార్డుల ప్రత్యేకాధికారులు, మెప్మా సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.
ఇల్లందకుంటలో..
మండలంలోని పలు గ్రామాల్లో పల్లె ప్రగతిలో భాగంగా ప్రత్యేకాధికారులు, సర్పంచులు పారిశుధ్య, జంగిల్ కటింగ్ పనులను చేపట్టారు. ప్రభుత్వం పల్లె ప్రగతిలో చేపడుతున్న పనుల గురించి ప్రత్యేకాధికారులు ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారులు డీటీ రాజేశ్వరి, ఎంపీవో వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శులు కిషన్, శ్రీనివాస్రెడ్డి, సంధ్యారాణి, స్వప్న, అంకూస్, రాజేశ్, కొండల్రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జమ్మికుంట మండలంలో..
పట్టణంతోపాటు మండలంలోని గ్రామాల్లో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకాధికారులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు పారిశుధ్య పనులను నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో చెత్తాచెదారం తొలగించి శుభ్రం చేయించారు. ఇక్కడ పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు ఉన్నారు.