వీణవంక, జూన్ 2: మండలంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్రం ఏర్పడి 8 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ సరిత, సొసైటీలో సింగిల్ విండో చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, వల్భాపూర్లో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్రెడ్డి, ఆయా గ్రామాల్లో సర్పంచులు జాతీయ జెండాలు ఎగురవేసి, స్వీట్లు పంపిణీ చేశారు. తహసీల్ కార్యాలయం వద్ద విద్యార్థులకు అధికారులు, ప్రజాప్రతినిధులు బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ సింగిల్విండో చైర్మన్ మాడ సాదవరెడ్డి, కో ఆప్షన్మెంబర్ హమీద్, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో ప్రభాకర్, ఆర్ఐలు ప్రవీణ్, రవీందర్, నాయకులు నల్ల తిరుపతిరెడ్డి, ఎలవేన మల్లయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు పాల్గొన్నారు.
హుజూరాబాద్ పట్టణంలో
హుజూరాబాద్టౌన్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర 8వ ఆవిర్భావ వేడుకలు పట్టణంలో గురువారం అంబరాన్నంటేలా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ గందె రాధిక, కోర్టు సముదాయంలో సీనియర్ సివిల్ జడ్జి డీవీ నాగేశ్వర్రావు, జూనియర్ సివిల్ జడ్జిలు అలేఖ్య, స్వాతి, ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ వెంకట్రెడ్డి, ఆర్డీవో కార్యాలయంలో డీఏవో జగత్సింగ్, తహసీల్ కార్యాలయం తహసీల్దార్ ఎల్ రాంరెడ్డి, టౌన్ పోలీస్స్టేషన్లో టౌన్ సీఐ వీ శ్రీనివాస్, రూరల్ పోలీస్స్టేషన్లో సీఐ బీ జనార్దన్, ఎంవీఐ కార్యాలయంలో ఎంవీఐ సిరాజ్ ఉర్ రహమాన్, ప్రభుత్వ ఏరియా దవాఖానలో డాక్టర్ రాజేందర్రెడ్డి, హుజూరాబాద్ సింగిల్ విండోలో చైర్మన్ ఎడవెల్లి కొండల్రెడ్డి, వ్యవసాయ మార్కెట్లో అధ్యక్షురాలు బర్మావత్ రమాయాదగిరి, ఏడీఏ కార్యాలయంలో ఏడీఏ అంజని, ఏవో సునీల్, బస్ డిపోలో డీఎం పీ అర్పిత, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎండీ మక్సూద్ అలీ, ఎంఈవో కార్యాలయంలో ఎంఈవో శ్రీనివాస్రెడ్డి, ఏఎస్డబ్ల్యువో కార్యాలయంలో తిరుపతినాయక్తో పాటు వివిధ సంఘాల ఆధ్వర్యంలో జెండాలను ఎగురవేశారు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద పట్టణశాఖ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాల్లో అధ్యక్షులు జీ రాజు, పీ కృష్ణారెడ్డి, కిరణ్కుమార్ జెండాలను ఆవిష్కరించారు.
పట్టణంలోని అన్ని పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు చౌరస్తాలోని అమర వీరులస్తూపం వద్ద నివాళులర్పించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు జెండాలను ఎగురవేసి, కేక్లు కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, ఎంపీపీ ఈ రాణి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సంగెం అయిలయ్య, మున్సిపల్ కమిషనర్ చీమ వెంకన్న, మేనేజర్ రాజారామ్మోహన్రాయ్, సీనియర్ నాయకులు వడ్లూరి విజయ్కుమార్, గందె శ్రీనివాస్, తాళ్లపెల్లి శ్రీనివాస్గౌడ్, పంజాల శ్రీధర్గౌడ్, ఎం ప్రభాకర్, బూసారపు బాబూరావు, కన్నెబోయిన శ్రీనివాస్, ఇమ్రాన్, ముక్క రమేశ్, తొగరు సదానందం, తోట రాజేంద్రప్రసాద్, జీ ఉమామహేశ్వర్, మక్కపెల్లి కుమార్యాదవ్, ముత్యంరాజు, బాషవేన కుమార్యాదవ్, దండ విక్రంరెడ్డి, గోవిందుల భాస్కర్, టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు కల్లెపల్లి రమాదేవి, నాయకులు మారపల్లి సుశీల, ప్రతాప మంజుల, కృష్ణ, కొండ్ర నరేశ్, లక్ష్మణమూర్తి, దవాఖాన ఆర్ఎంవో సుధాకర్రావు, ఎస్ఐలు వీరన్న, సాజిద్, ఏఎస్ఐ రవికుమార్, కౌన్సిలర్లు, ఆయా పార్టీల, సంఘాల నాయకులు పాల్గొన్నారు.
హుజూరాబాద్ మండలంలో..
హుజూరాబాద్ రూరల్, జూన్ 2: మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఇరుమల్ల రాణీసురేందర్రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏడీఏ అంజలి, గ్రామ పంచాయతీ అవరణలో సర్పంచులు, పొదుపు సంఘాల్లో అధ్యక్షులు, తుమ్మనపల్లి, జూపాక, హుజూరాబాద్ సింగిల్ విండో కార్యాలయాల్లో కౌరు సుగుణాకర్రెడ్డి, శ్యాంసుందర్రెడ్డి, కొండల్రెడ్డి జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.
జమ్మికుంటలో..
జమ్మికుంట, జూన్ 2: మున్సిపల్ ఆధ్వర్యంలో కార్యాలయం, తెలంగాణ చౌక్ వద్ద మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు జెండా ఎగురవేశారు. పాత మున్సిపల్ కార్యాలయం అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్న, సీఐ రాంచందర్రావు, కమిషనర్ సమ్మయ్య, తహసీల్దార్ రాజారెడ్డి, ఎంఈవో శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
జమ్మికుంట మండలంలో..
జమ్మికుంట రూరల్, జూన్ 2: ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ దొడ్డె మమత, వావిలాల ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుడు తులసీదాస్, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మాదిరెడ్డి వెంకట్రెడ్డి, సర్పంచులు కడిపికొండ రాజిరెడ్డి, రాచపల్లి సదయ్య, గిరవేన రమారాజయ్య, జొజ్జం కల్పనాతిరుపతిరెడ్డి, మూగలపరువు రాములు, చందుపట్ల స్వాతికృష్ణారెడ్డి, సుంకిశాల పద్మ, వజ్జెపల్లి ఆగయ్య, కాట్మండి మహేందర్, ఇల్లందుల అన్నపూర్ణ, పుప్పాల శైలజారాజారాం, ఆకినపల్లి సుజాతాభద్రయ్య, చిలుముల వసంతారామస్వామి, జక్కెన శ్రీలతాసత్యనారాయణ, బోయిని రాజ్కుమార్, పింగళి రమాదేవి, పోతరవేన రాజ్కుమార్ జాతీయ జెండాలను ఎగరవేశారు. ఇక్కడ వైస్ఎంపీపీ పొల్సాని తిరుపతిరావు ఎంపీటీసీ ఫోరం అధ్యక్షురాలు కడవేర్గు మమత, ఎంపీటీసీలు తోట కవితాలక్ష్మణ్, మర్రి మల్లేశం, రాచపల్లి రాజయ్య, సంపెల్లి స్వరూప, వాసాల నిరోష, కోఆప్షన్ సభ్యుడు ఎండీ రఫీ ఉన్నారు.
సైదాపూర్లో..
సైదాపూర్, జూన్2: మండలకేంద్రంలోని పోలీస్స్టేషన్ వద్ద ఎస్ఐ జున్ను ఆరోగ్యం, టీఆర్ఎస్ కార్యాలయం వద్ద మండలాధ్యక్షుడు సోమారపు రాజయ్య జెండావిష్కరించారు. ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్రెడ్డి, వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు చంద శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చెలిమెల రాజేశ్వర్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు ఉన్నారు.
ఇల్లందకుంటలో..
ఇల్లందకుంట, జూన్ 2: మండలంలోని తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ సురేఖ, పోలీస్స్టేషన్లో ఎస్ఐ తిరుపతి, వ్యవసాయ కార్యాలయంలో ఏవో రజిత, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యురాలు జ్యోత్స, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో విజయలక్ష్మి, శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయంలో ఈవో సుధాకర్, మోడల్ స్కూల్లో హెచ్ఎం సత్యానారయణాచారి, ఇల్లందకుంట పీఏసీఎస్ కార్యాలయంలో వైస్ చైర్మన్ కందాల కొమురెల్లి, ఐకేపీ కేంద్రంలో ఏపీఎం రమాదేవి, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు రజితావాసుదేవారెడ్డి, మొగిలి, ఎల్లారెడ్డి, సరోజన, మానస, వనమాల, అరుణ, దిలీప్రెడ్డి, రఫీఖాన్, మల్లయ్య జెండాలను ఎగరవేశారు. ఎంపీటీసీలు సంజీవరెడ్డి, విజయకుమార్, చిన్నరాయుడు, అయిలయ్య, ఓదెలు, ఏఈవోలు సంపత్, మహేందర్, మౌనిక, సంపత్, ఐకేపీ సీసీలు జానీ, రమేశ్, సుమలత, డీటీ రాజేశ్వరి, ఆర్ఐ రవి, పీఏసీఎస్ సీఈవోలు ఆదిత్య, శ్రీనివాస్, దేవేందర్, పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.