పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 19: స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ ప్ర భుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలకు గౌరవం లభిస్తున్నదని, అన్ని వర్గాలను ఆనందం గా ఉంచేందుకే రాష్ట్ర ప్రభుత్వం పండుగకు కానుకలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టిందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి స్పష్టం చేశారు. పెద్దపల్లి మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం ముస్లింలకు ప్రభుత్వం ద్వారా వచ్చిన రంజాన్ పండుగ గిఫ్ట్ ప్యాక్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ పేద కుటుంబాల వారంతా పండుగపూట సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతోనే అన్ని పండుగలకు గిఫ్ట్ ప్యాక్లను కానుకలుగా అందజేస్తున్నారన్నారు. పెద్దపల్లి నియోజకవర్గానికి మొత్తం 1500 రంజాన్ గిఫ్ట్ ప్యాక్లు వచ్చాయని, అర్హులైన వారికి మజీద్ ఇమామ్, మౌసమ్ల ద్వారా అందిస్తామని పేర్కొన్నారు.
వీటితో పాటు సామూహిక ఇఫ్తార్ విందులను సైతం ప్రభుత్వమే ఇచ్చేలా చర్యలు తీసుకుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతీ శ్రీనివాస్ గౌడ్, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖాధికారి మెహరాజ్ మహ్మద్, తహసీల్దార్ దుర్శెట్టి శ్రీనివాస్, ఎంపీడీవో ఎం.రాజు, వైస్ ఎంపీపీ ముత్యాల రాజయ్య, మండల కో ఆప్షన్ సభ్యుడు ఎండీ హబీబ్ ఉర్ రహమాన్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ నా జ్మీన్ సుల్తానా మోబిన్, కౌన్సిలర్లు గాదె మాధవి, పెంచాల రమాదేవి శ్రీధర్, ఎంపీటీసీలు జక్కుల రుక్కమ్మ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మర్కు లక్ష్మణ్, నాయకులు సాబీర్ఖాన్, జాకీర్ హుస్సే న్, పెద్దపల్లి పట్టణంతోపాటు మండలంలోని పలు మజీద్ల ఇమామ్లు,మౌసమ్లు పాల్గొన్నారు.