జగిత్యాల, జనవరి 10 (నమస్తే తెలంగాణ): ‘ఉమ్మడి రాష్ట్రంలో స్టడీ సర్కిల్ అనేది కేవలం హైదరాబాద్కు మాత్రమే పరిమితమయ్యేది. ఆంధ్ర, రాయలసీమకు చెందిన విద్యార్థులే ఎక్కు వగా ఉండేవారు. మనవారికి తీవ్ర అన్యాయం జరిగేది. వాటన్నింటిని దృష్టిలో ఉంచుకునే స్వ రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలవారీగా సకల హంగుల తో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేశాం’ అని మంత్రి కొప్పుల ఉద్ఘాటించారు. ఇప్పటికే రాష్ట్రంలో పది ఎస్సీ స్టడీ సర్కిల్స్ నడుస్తున్నాయని, 11వ స్టడీ సర్కిల్ను జగిత్యాలలో ఏర్పాటు చేసినట్లు చెప్పా రు. మరో ఐదు స్టడీ సర్కిల్స్ను కొత్త జిల్లాల్లో ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని సీఎం కేసీఆర్కు విన్నవించినట్లు చెప్పారు. సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో 1.15 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎస్సీ స్టడీ సర్కిల్ను ప్రారంభించి, మాట్లాడారు. జగిత్యాలలో అన్ని హంగులతో స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేశామని, 100 మంది ఐదు నెలలపాటు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ఉచిత భోజనం, వసతితో కూడిన శిక్షణ ఇస్తారని తెలిపారు. విద్యార్థులు స్టడీ సర్కిల్ను వినియోగించుకొని, బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. కొత్త జిల్లాల్లో మొదటి సారిగా ఏర్పాటు చేసిన జగిత్యాల స్టడీ సర్కిల్ను ఆదర్శంగా నిలుపాలని మంత్రి ఆకాంక్షించారు.
గురుకులాలు దేశానికే ఆదర్శం..
రాష్ట్రంలో విద్యారంగం సంస్కరణ దిశలో సాగుతున్నదని, గురుకులాలు దేశానికే మార్గదర్శకంగా నిలిచాయని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర సా ధన అనంతరం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటున్నదని చెప్పారు. పరిపాలన వికేంద్రీకరణ, ప్రాంతాల సమాన అభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన జిల్లాల పునర్విభజన గొప్ప ఫలితాలనిస్తున్నదని వివరించారు. జిల్లాల ఏర్పాటు అనంతరం ఒక్కొక్కటిగా సౌకర్యాలను చేకూర్చుకుంటున్నామని చెప్పారు. నూతన జిల్లాగా ఏర్పడిన జగిత్యాల నేడు అభివృద్ధి పథంలో అగ్రస్థానానికి చేరువవుతున్నదన్నారు. జిల్లాకు ఇటీవలే సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీని సైతం మంజూరు చేశారని గుర్తు చేశారు.
లక్షల మంది విద్యాభ్యాసం
స్వరాష్ట్రంలో విద్యారంగాన్ని పూర్తిస్థాయిలో సంస్కరించే దిశలో సీఎం కేసీఆర్ పయనిస్తున్నారని, దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ, బీ సీ, మైనార్టీ, జనరల్ కేటగిరీలో వందలాది గురుకులాలను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. నా ణ్యమైన భోజనం, బోధనతో గురుకులాలు నేడు సంచలనాలు సృష్టిస్తున్నాయని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో అన్ని గురుకులాల్లో కలిపి ఏటా 4.82 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. ఒక్క సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాలల్లోనే ఏటా 82వేల మంది చదువుతున్నారని చెప్పారు. ఈ ఏడాది గురుకులాల్లో చదివిన వారిలో 250 మంది మెడిసిన్ కోర్సులకు, 700 మంది ఇంజినీరింగ్ కోర్సులకు, 150 మంది ఐఐటీ కోర్సులకు ఎంపికకావడం తెలంగాణ గురుకుల విద్యా వ్యవస్థకు గర్వకారణమని పేర్కొన్నా రు. తెలంగాణలోని గురుకులాలు దేశానికి ఆదర్శంగా మారాయని, పలు రాష్ర్టాల నుంచి విద్యావేత్తలు, అధికారులు తెలంగాణ గురుకులాల వి ధానాన్ని ప్రత్యక్షంగా అధ్యయనం చేసి వారి రాష్ర్టాల్లో అమలు చేసేందుకు యత్నిస్తున్నారని చెప్పారు.
సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే సంజయ్కుమార్ మాట్లాడుతూ, ప్రపంచంతో పోటీ పడుతూ, విద్యార్థులు రాణించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమానికి వేగు చుక్కలైన విద్యార్థుల కోసం విద్యారంగాన్ని పూర్తిగా సంస్కరించారన్నారు. సన్నబియ్యం భోజనాన్ని విద్యార్థులకు అందజేసిన ఘనత సీఎం కేసీఆర్కు మాత్రమే దక్కుతుందన్నారు. కలెక్టర్ గుగులోత్ రవి మాట్లాడుతూ, జగిత్యాలలో స్టడీ సర్కిల్ ఏర్పాటు గొప్ప విషయమన్నారు. 20ఏండ్ల క్రితం తాను స్టడీ సర్కిల్లోనే శిక్షణ పొందానని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ గొల్లపల్లి చంద్రశేఖర్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ బోగ శ్రావణి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ పాల్గొన్నారు.