కరీంనగర్ రూరల్: దొడ్డు రకం ధాన్యాన్ని సేకరించబోమని ఎఫ్సీఐ చెబుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సూచించారు.
ఆదివారం ఆయన కరీంనగర్ మండలంలోని తాహెర్ కొండాపూర్ గ్రామంలోని పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి స్థానిక రైతులతో సమావేశమై మాట్లాడారు. రాజ్యాంగం ప్రకారం పండిన పంటలను సేకరించడం, నిల్వ చేయడం, మార్కెటింగ్, ఎగుమతి చేయడం కేంద్ర ప్రభుత్వ భాధ్యతని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు నాణ్యమైన కరెంట్, నీరు, పెట్టుబడి సాయం ఇతర మౌలిక వసతులను రైతులకు కల్పించే అధికారం మాత్రమే ఉన్నదన్నారు.
సీఎం కేసీఆర్ కృషితో గ్రామాల్లో సమృద్ధిగా నీరు, ఉచిత కరెంటు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. ఉప్పు బియ్యం నిల్వల సాకుతో మన్న రైతాంగానికి నష్టం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉండడంతో రైతులు వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలైన నూనె గింజలు, ఆయిల్పామ్, వేరుశనగ, పొద్దుతిరుగుడు, పత్తి, కంది పంటలను సాగు చేయాలన్నారు.