గోదావరిఖని : సింగరేణి ఆర్జీ-1 పరిధిలో మెడికల్ ఇన్వాలిడేషన్, మృతి చెందిన ఉద్యోగుల 15 మంది డిపెండెంట్లకు కారుణ్య నియామక ఉత్తర్వులను ఆర్జీ-1 జీఎం కే నారాయణ అందజేశారు. ఈ మేరకు స్థానిక జీఎం కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అతి తక్కువ సమయంలో వీరందరికీ పోస్టింగ్ ఇచ్చినట్లు చెప్పారు. ఇందులో 14 మంది మెడికల్ ఇన్వాలిడేషన్, ఒకరు డెత్ కేసు అని తెలిపారు.
మొత్తం 15 మందికి అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో పోస్టింగ్ ఇవ్వనున్నామని, కొత్తగా ఉద్యోగంలో చేరబోయే యువ కార్మికులు ఇప్పటి పరిస్థితులకు అనుకూలంగా పని నైపుణ్యాన్ని మెరుగుపర్చుకొని కంపెనీ పురోభివృద్ధికి పాటు పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు దామోదర్రావు, సీఎంఓఐ జాయింట్ సెక్రటరీ సురేశ్బాబు, డీజీఎం పర్సనల్ ఎస్ రమేశ్, తదితరులు పాల్గొన్నారు.