శంకరపట్నం: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత వీరనారి చాకలి ఐలమ్మ అని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంతోపాటు మొలంగూర్లో రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే రసమయి మాట్లాడుతూ.. చిట్యాల ఐలమ్మ సామాజిక, ఆధునిక పరిణామానికి నాంది పలికిన ధైర్యశాలి అని కొనియాడారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం పేదల పక్షాన పోరాడిన ధీర వనిత అని అన్నారు.
సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సాధనకు ఆమె వీరత్వాన్ని, పోరాట పటిమను స్ఫూర్తిగా తీసు కున్నారని, అందుకే ఆమె జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రతిఏటా అధికారికంగా నిర్వహిం చేందుకు ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ జయంతి రోజున ఆమె విగ్రహ ఏర్పాటుకు మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద భూమిపూజ నిర్వహించుకోవడం శుభ సూచకమని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు.
అంతకుముందు ఆయన చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా రజక సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్లు మోరె అనూష, బైరి సంపత్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు పెద్ది శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీలు బొజ్జ కవిత, ఏనుగుల అనిల్, ఉప సర్పంచ్ వెంకన్న, సింగిల్ విండో చైర్మన్లు పొద్దుటూరి సంజీవరెడ్డి, గురాల తిరుపతిరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ కృష్ణారెడ్డి, టీఆర్ఎస్, బీజేపీ మండల శాఖల అధ్యక్షులు గంట మహిపాల్, చల్ల ఐలయ్య, తెలంగాణ రజక సంఘం మండల అధ్యక్షుడు తాడిచర్ల తిరుపతి, నియోజకవర్గ ఇన్చార్జి శంకర్, రజక సంఘం నాయకులు కోటి, క్రాంతి, సంపత్, శ్రీనివాస్, రాజయ్య, సంతోష్, కుమార్ పాల్గొన్నారు.