హుజూరాబాద్ : బీజేపీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు ఈదులకంటి రమాదేవి, హుజూరాబాద్ పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఈదులకంటి మంజుల మంగళవారం రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయంలో నిబంధనలు విధించిందని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి నిబంధనల్లేకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయడంతోపాటు ఉద్యోగ నియామకాల్లో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్ల వయోపరిమితి సడలించిందని, అలాగే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినందుకు బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ విజయానికి కృషి చేస్తామన్నారు.