గొల్లపల్లి, జనవరి 21: రాపెల్లి గ్రామంలో ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త, ఇన్చార్జి కోఆర్డినేటర్ డాక్టర్ ఎం రాజేంద్రప్రసాద్, డాక్టర్ విజయ్ భాసర్ ప్ర స్తుత వాతావరణ పరిస్థితుల్లో వరిలో ప్రధాన సమ స్య మొగి పురుగు, ఆగ్గి తెగులుపై రైతులతో శనివా రం క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎం రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, మొగి పురుగు లక్షణాలు, నివారణ చర్యలను వివరించారు. నారుమడిలో ఆశిస్తే, పిలక దశలో ఆశిస్తే మొకలు ఎండి చనిపోతాయని తెలిపారు. అంకు రం నుంచి చిరు పొట్ట దశలో ఆశిస్తే ఈనిన తర్వాత తెల్ల కంకులు బయటికి వస్తాయన్నారు. ఆలస్యంగా ముదురు నారు నాటడం, కరువు పరిస్థితులు, తకువ రాత్రి ఉష్ణోగ్రతలు ఉండి, సూర్యరశ్మి రోజుకు 7 గంటల కంటే ఎకువ ఉంటే ఈ పురుగు రావడానికి అనుకూలమని తెలిపారు. ముదురు గోధుమ, ఎండుగడ్డి, పసుపు రంగులో ఉన్న ఆడ పురుగుల ముందు జత రెకలపై నల్లటి మచ్చ కలిగి ఉంటాయని వివరించారు.
తెలుపు గోధుమ రంగులో ఉండే పిల్ల పురుగులు (లార్వా) ఎదిగిన తర్వాత నారింజ పసుపు రంగు తల కలిగి ఉంటుందని తెలిపారు. నారు తీసే 7 రోజుల ముందు 2 గుంటల నారు మడికి 800 గ్రాముల కార్బోప్యురాన్ 3జీ గులికలను చల్లి నీటిని ఆ మడిలోనే ఇంకెలా చేయాలని సూచించారు. ముదురు నాటు నాటేటప్పుడు నారు కొనలను తుంచి వేయాలని, నాట్లు వేసిన 10 నుంచి 15 రోజుల్లో కార్బోప్యురాన్ 3జీ గుళికలను ఎకరానికి 10 కిలోల చొప్పున లేదా కార్టప్ హైడ్రోక్లోరైడ్ 4జీ గుళికలు ఎకరానికి 8 కిలోలు లేదా క్లోరాంత్రనిలిప్రోల్ 0.4జీ గుళికలు 4 కిలోలు చల్లుకోవాలన్నారు. ఉధృతి ఎకువగా ఉన్నప్పుడు కార్టప్ హైడ్రో క్లోరైడ్ 50 ఎస్పీ 400 గ్రాములు ఎకరాకు లేదా ప్రొఫెనఫోస్ 400 మిల్లీలీటర్లు ఎకరాకు పిచికారీ చేసుకోవాలని, సల్ఫయిడ్ నివారణకు కాంప్లెక్స్ ఎరువులను పైపాటిగా చల్లకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. మురగు నీరుని తీసేసి సన్నటి పగుళ్లు వచ్చేవరకు వరి పొలాన్ని ఆరబెట్టుకోవాలన్నారు. అగ్గి తెగులు నివారణకు ట్రై సైక్లోజోల్ 0.6 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈవో సుమలత, రైతులు తదితరులు పాల్గొన్నారు.
మల్లాపూర్, జనవరి 21: మండలకేంద్రంతో పాటు సిరిపూర్, రాఘవపేట గ్రామాల్లో వరి పంటలను ఏవో లావణ్య పరిశీలించారు. ఈ సందర్భంగా వరి పంటలకు తొలుచు పురుగు నష్టం, సుడిదోమ, పచ్చదోమ తదితర రోగాలు సొకినట్లు గుర్తించినట్లు తెలిపారు. వీటి నివారణపై రైతులకు సూచనలు చేశారు. ఇక్కడ ఏఈవోలు గజానంద్, సంధ్య, రైతులు పాల్గొన్నారు.
మెట్పల్లి రూరల్, జనవరి 21: పెద్దాపూర్ గ్రా మంలో మొగిపురుగు ఆశించిన వరి పంటను ఏఈవో రాజు రైతులతో కలిసి పరిశీలించారు ఆయన వెంట రైతులు కొమ్ముల రమేశ్రెడ్డి, కాటిపెల్లి రఘుపతిరెడ్డి, రవీందర్రెడ్డి, ముదాం మల్లేశ్, చేపూరి జీవన్రెడ్డి, దోతుల రమేశ్ ఉన్నారు.
ధర్మపురి, జనవరి 21: దమ్నన్నపేట గ్రామంలో వ్వవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు వరి తెగుళ్ల నివారణపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. ప్రస్తుతం వరిలో వస్తున్న తెగుళ్లు, చీడపీడల గురిం చి ఏఈవోలు ధరణి, మౌనిక రైతులకు వివరించారు. కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ దండవేని గంగమల్లయ్య, ఆర్బీఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు సత్తయ్య తదితరులున్నారు.